మెట్రో, ఎసి, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ
- March 26, 2026
హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తలెత్తిన ఇంధన కొరత దృష్ట్యా, నగర వాహనదారులకు ఊరటని చ్చేలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు.పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచిచూస్తున్న సామాన్యుడి కష్టాలను గమనించి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.
హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు నగరవాసులు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. పెట్రోల్తో ఇబ్బందులు పడటం ఎందుకు దండగ, ఆర్టీసీ బస్సులు ఉండగా! తమ బస్సుల్లో ప్రయాణించండని ఎండీ నాగిరెడ్డి ప్రజలకు విజప్తి చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- మెట్రో, ఎసి, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ
- ఏపీ ఆస్తిపన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్..
- శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభం
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు









