ఓటీటీలో హెబ్బా పటేల్ కొత్త సినిమా
- March 27, 2026
హాట్ బ్యూటీ హెబ్బా పటేల్, చైతన్య రావు జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘రేపు ఉదయం 10 గంటలకు’. ఈ సినిమా సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో, కేవలం పది రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ‘ఓ పిట్ట కథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ వంటి వైవిధ్యమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చెందు ముద్దు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
గతంలో ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’ చిత్రంతో అలరించిన హెబ్బా- చైతన్య జోడీ, ఈసారి థ్రిల్లర్ జోనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామ్ వీరపనేని నిర్మించిన ఈ సినిమాలో అభినవ్ గోమటం, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. కథపరంగా ఆసక్తిని కలిగించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి తీసుకొచ్చారు. సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారికి ఈ వీకెండ్ వాచ్గా ఇది నిలుస్తుంది. మరి థియేటర్స్ లో ప్లాప్ అయిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









