ఓటీటీలో హెబ్బా పటేల్ కొత్త సినిమా
- March 27, 2026
హాట్ బ్యూటీ హెబ్బా పటేల్, చైతన్య రావు జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘రేపు ఉదయం 10 గంటలకు’. ఈ సినిమా సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో, కేవలం పది రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ‘ఓ పిట్ట కథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ వంటి వైవిధ్యమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చెందు ముద్దు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
గతంలో ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’ చిత్రంతో అలరించిన హెబ్బా- చైతన్య జోడీ, ఈసారి థ్రిల్లర్ జోనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామ్ వీరపనేని నిర్మించిన ఈ సినిమాలో అభినవ్ గోమటం, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. కథపరంగా ఆసక్తిని కలిగించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి తీసుకొచ్చారు. సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారికి ఈ వీకెండ్ వాచ్గా ఇది నిలుస్తుంది. మరి థియేటర్స్ లో ప్లాప్ అయిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







