యూత్ సిటీ 2030కు ఎన్‌బీబీ ప్లాటినం స్పాన్సర్..!!

- July 18, 2026 , by Maagulf
యూత్ సిటీ 2030కు ఎన్‌బీబీ ప్లాటినం స్పాన్సర్..!!

మనామా: బహ్రెయిన్ నేషనల్ బ్యాంక్ (ఎన్‌బీబీ) ప్రతినిధి బృందం 2026 యూత్ సిటీ 2030 కార్యక్రమాన్ని సందర్శించింది. యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఎన్‌బీబీ ప్లాటినం స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. పర్యటనలో భాగంగా ప్రతినిధులు శిక్షణా కేంద్రాలు, ప్రత్యేక కార్యక్రమాలను పరిశీలించారు.
బ్యాంకు పేరుతో ఏర్పాటు చేసిన తరగతి గదిని సందర్శించి, యువతలో నాయకత్వ లక్షణాలు, ఆవిష్కరణలు, నైపుణ్యాల అభివృద్ధికి ఈ కార్యక్రమం చేస్తున్న కృషిని అభినందించారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలకు తమ మద్దతు కొనసాగుతుందని ఎన్‌బీబీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com