కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!
- March 28, 2026
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా తనిఖీ చేశారు. ఈ పర్యటన సందర్భంగా, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి అనంతరం చెలరేగిన అగ్నిప్రమాదాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలను, అలాగే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి సంబంధిత అధికారులు చేసిన కృషిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారుల సంసిద్ధత మరియు సమన్వయ స్థాయిని సమీక్షించారు. అనంతరం అధికారులతో ప్రధానమంత్రి సమావేశాన్ని నిర్వహించారు.
అగ్నిప్రమాదాన్ని అదుపు చేయడానికి అమలు చేసిన భద్రతా చర్యల గురించి ఆయనకు అధికారులు వివరించారు.ఆయన ఇంధన ట్యాంకుల ప్రాంతంలోని దాడి జరిగిన ప్రదేశాన్ని కూడా పరిశీలించి, జరిగిన నష్టాన్ని సమీక్షించారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







