కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!
- March 28, 2026
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా తనిఖీ చేశారు. ఈ పర్యటన సందర్భంగా, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి అనంతరం చెలరేగిన అగ్నిప్రమాదాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలను, అలాగే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి సంబంధిత అధికారులు చేసిన కృషిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారుల సంసిద్ధత మరియు సమన్వయ స్థాయిని సమీక్షించారు. అనంతరం అధికారులతో ప్రధానమంత్రి సమావేశాన్ని నిర్వహించారు.
అగ్నిప్రమాదాన్ని అదుపు చేయడానికి అమలు చేసిన భద్రతా చర్యల గురించి ఆయనకు అధికారులు వివరించారు.ఆయన ఇంధన ట్యాంకుల ప్రాంతంలోని దాడి జరిగిన ప్రదేశాన్ని కూడా పరిశీలించి, జరిగిన నష్టాన్ని సమీక్షించారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!









