కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!
- March 28, 2026
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా తనిఖీ చేశారు. ఈ పర్యటన సందర్భంగా, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి అనంతరం చెలరేగిన అగ్నిప్రమాదాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలను, అలాగే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి సంబంధిత అధికారులు చేసిన కృషిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారుల సంసిద్ధత మరియు సమన్వయ స్థాయిని సమీక్షించారు. అనంతరం అధికారులతో ప్రధానమంత్రి సమావేశాన్ని నిర్వహించారు.
అగ్నిప్రమాదాన్ని అదుపు చేయడానికి అమలు చేసిన భద్రతా చర్యల గురించి ఆయనకు అధికారులు వివరించారు.ఆయన ఇంధన ట్యాంకుల ప్రాంతంలోని దాడి జరిగిన ప్రదేశాన్ని కూడా పరిశీలించి, జరిగిన నష్టాన్ని సమీక్షించారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







