కువైట్ లో క్షిపణి, డ్రోన్ దాడుల్లో 10 మందికి గాయాలు..!!
- March 30, 2026
కువైట్ః క్షిపణులు, డ్రోన్లతో ఒక సైనిక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన వైమానిక దాడిలో 10 మంది సాయుధ దళాలు గాయపడ్డాయని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో దేశ గగనతలంలోకి ప్రవేశించిన 14 బాలిస్టిక్ క్షిపణులను, 12 డ్రోన్లను కువైట్ వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని అధికార ప్రతినిధి సౌద్ అల్-అత్వాన్ తెలిపారు. ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ, కొన్ని క్షిపణులు ఒక సైనిక స్థావరంపై పడిందని తెలిపారు. గాయపడిన సిబ్బంది చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. ఈ దాడిలో ఒక ప్రైవేట్ లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన వేర్ హౌజ్ ని కూడా లక్ష్యంగా చేసుకున్నారని, దీనివల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కేవలం ఆస్తి నష్టం జరిగిందన్నారు.
ఫిబ్రవరి 28 నుంచి కువైట్ 307 బాలిస్టిక్ క్షిపణులు, రెండు క్రూయిజ్ క్షిపణులు, 616 డ్రోన్లను ఎదుర్కొందని అల్-అత్వాన్ వెల్లడించారు. సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, దేశ భద్రతను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలను కొనసాగిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- మహిళను హత్య చేసి ఫ్రిజ్లో భద్రపరిచిన వ్యక్తి లొంగుబాటు
- తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు..22 జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- మయామి ఓపెన్ విజేతగా జానిక్ సినర్
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన EV సంస్థలు
- తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్
- యూఏఈ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ మరింత బలంగా ఆవిర్భవిస్తుంది: షేక్ మహమ్మద్
- దమ్మామ్, జుబైల్ పోర్టులలో ఫీజు మినహాయింపు పొడిగింపు..!!
- ప్రాంతీయ భద్రత, సముద్ర ముప్పులపై అరబ్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- మార్కెట్ స్టెబిలిటీ కోసం సీపీఏ ముమ్మర ప్రయత్నాలు..!!
- ఖతార్ లో పాస్పోర్ట్ డైరెక్టరేట్కు చెందిన 11 సేవా కేంద్రాలు, పని వేళలు..!!









