సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- March 30, 2026
జెడ్డా: ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని సోమవారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు. ఆయనకు జెడ్డాలోని కింగ్ అబ్దులజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, గల్ఫ్ ప్రాంతీయ పరిణామాలు, పరస్పర సహకార అంశాలపై కీలక చర్చలు జరిపారు. గల్ఫ్ దేశాల ఐక్యతను బలోపేతం చేసే దిశగా ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
సౌదీ–ఖతార్ సంబంధాలు గత కొన్నేళ్లలో మరింత బలపడుతున్న నేపథ్యంలో, ఈ పర్యటనను దౌత్యపరంగా కీలక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు దేశాల నాయకుల భేటీ ప్రాంతీయ స్థిరత్వం మరియు భద్రతా అంశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









