మాటకు కట్టుబడి ఉండకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు : బాలకృష్ణ
- August 04, 2016
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం ఉదయం సచివాలయంలో ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ''ప్రత్యేక హోదా విషయంలో ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. ఏపీని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు.. దానికి కట్టుబడి ఉండాలి. ప్రత్యేక హోదా ఐదు కాదు, పదేళ్లు కావాలని ఆనాడు భాజపా నేతలు డిమాండ్ చేశారు. హోదా ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గతంలోనే హెచ్చరించా. పౌరుషం విషయంలో తెలుగువారు తక్కువేమీ కాదు. చెప్పిన మాటకు కట్టుబడి ఉండకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు'' అని బాలకృష్ణ హెచ్చరించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









