మాటకు కట్టుబడి ఉండకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు : బాలకృష్ణ
- August 04, 2016
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం ఉదయం సచివాలయంలో ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ''ప్రత్యేక హోదా విషయంలో ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. ఏపీని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు.. దానికి కట్టుబడి ఉండాలి. ప్రత్యేక హోదా ఐదు కాదు, పదేళ్లు కావాలని ఆనాడు భాజపా నేతలు డిమాండ్ చేశారు. హోదా ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గతంలోనే హెచ్చరించా. పౌరుషం విషయంలో తెలుగువారు తక్కువేమీ కాదు. చెప్పిన మాటకు కట్టుబడి ఉండకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు'' అని బాలకృష్ణ హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







