మాటకు కట్టుబడి ఉండకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు : బాలకృష్ణ

- August 04, 2016 , by Maagulf
మాటకు కట్టుబడి ఉండకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు : బాలకృష్ణ

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం ఉదయం సచివాలయంలో ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ''ప్రత్యేక హోదా విషయంలో ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. ఏపీని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు.. దానికి కట్టుబడి ఉండాలి. ప్రత్యేక హోదా ఐదు కాదు, పదేళ్లు కావాలని ఆనాడు భాజపా నేతలు డిమాండ్‌ చేశారు. హోదా ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గతంలోనే హెచ్చరించా. పౌరుషం విషయంలో తెలుగువారు తక్కువేమీ కాదు. చెప్పిన మాటకు కట్టుబడి ఉండకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు'' అని బాలకృష్ణ హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com