ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- April 03, 2026
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో కీలక నిర్ణయం తీసుకున్నారు.నగరవ్యాప్తంగా గతంలో అమర్చిన సీసీ కెమెరాల్లో చాలా భాగాన్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ భద్రతకు ముప్పు ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తూ ఈ చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియను ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేష్ సాహిబ్ సింగ్ ప్రారంభించారు. దశలవారీగా కెమెరాలను తొలగించి వాటి స్థానంలో సురక్షితమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఢిల్లీలో రెండు దశల్లో మొత్తం 2 లక్షలకుపైగా సీసీ కెమెరాలు అమర్చారు. మొదటి దశలో అమర్చిన కెమెరాలు ఎక్కువగా చైనా కంపెనీ హైక్విజన్ కు చెందినవిగా ఉన్నాయి. ఈ కంపెనీ కెమెరాలపై ప్రపంచవ్యాప్తంగా భద్రతా సంబంధిత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సున్నితమైన సమాచారాన్ని ఇతర దేశాలకు చేరే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ కెమెరాలను తొలగించి వాటి స్థానంలో స్వదేశీ లేదా భద్రతా ప్రమాణాలు ఉన్న పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఇండియాలో ఎబోలా అలర్ట్..
- IPL ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..
- డ్రింక్స్ ల్లో మత్తుమందు.. అప్రమత్తంగా ఉండాలని పోలీసుల విజ్ఞప్తి..!!
- యూఏఈలో సమ్మర్ సందడి.. బీచ్ భద్రత, ప్రథమ చికిత్సపై అవగాహన..!!
- నెలరోజుల్లో 42వేలకుపైగా తనిఖీలు చేసిన కామర్స్ మినిస్ట్రీ..!!
- ఖతార్లోని CBSE టాపర్లను సన్మానించిన ICC..!!
- సుల్తాన్ తుర్కీ బిన్ సయీద్ రోడ్ ప్రాజెక్టు.. కొత్తగా 7 కి.మీ. ప్రారంభం..!!
- పేలుడు పదార్థాల నిర్మూలన చేపట్టిన కువైట్ సైన్యం..!!
- 60 రోజుల్లో ఉద్యోగం దొరక్కపోతే అమెరికాను వీడాల్సిందే..టెకీలకు డెడ్లైన్
- రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు: సీఎం రేవంత్ రెడ్డి









