ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- April 03, 2026
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో కీలక నిర్ణయం తీసుకున్నారు.నగరవ్యాప్తంగా గతంలో అమర్చిన సీసీ కెమెరాల్లో చాలా భాగాన్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ భద్రతకు ముప్పు ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తూ ఈ చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియను ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేష్ సాహిబ్ సింగ్ ప్రారంభించారు. దశలవారీగా కెమెరాలను తొలగించి వాటి స్థానంలో సురక్షితమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఢిల్లీలో రెండు దశల్లో మొత్తం 2 లక్షలకుపైగా సీసీ కెమెరాలు అమర్చారు. మొదటి దశలో అమర్చిన కెమెరాలు ఎక్కువగా చైనా కంపెనీ హైక్విజన్ కు చెందినవిగా ఉన్నాయి. ఈ కంపెనీ కెమెరాలపై ప్రపంచవ్యాప్తంగా భద్రతా సంబంధిత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సున్నితమైన సమాచారాన్ని ఇతర దేశాలకు చేరే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ కెమెరాలను తొలగించి వాటి స్థానంలో స్వదేశీ లేదా భద్రతా ప్రమాణాలు ఉన్న పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







