ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- April 03, 2026
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో కీలక నిర్ణయం తీసుకున్నారు.నగరవ్యాప్తంగా గతంలో అమర్చిన సీసీ కెమెరాల్లో చాలా భాగాన్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ భద్రతకు ముప్పు ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తూ ఈ చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియను ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేష్ సాహిబ్ సింగ్ ప్రారంభించారు. దశలవారీగా కెమెరాలను తొలగించి వాటి స్థానంలో సురక్షితమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఢిల్లీలో రెండు దశల్లో మొత్తం 2 లక్షలకుపైగా సీసీ కెమెరాలు అమర్చారు. మొదటి దశలో అమర్చిన కెమెరాలు ఎక్కువగా చైనా కంపెనీ హైక్విజన్ కు చెందినవిగా ఉన్నాయి. ఈ కంపెనీ కెమెరాలపై ప్రపంచవ్యాప్తంగా భద్రతా సంబంధిత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సున్నితమైన సమాచారాన్ని ఇతర దేశాలకు చేరే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ కెమెరాలను తొలగించి వాటి స్థానంలో స్వదేశీ లేదా భద్రతా ప్రమాణాలు ఉన్న పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







