మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- April 03, 2026
కువైట్: కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (KNPC) నిర్వహిస్తున్న మీనా అల్-అహ్మది రిఫైనరీపై శుక్రవారం తెల్లవారుజామున డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఆ ప్రాంగణంలోని పలు ఆఫరేషనల్ యూనిట్స్ లో మంటలు చెలరేగాయని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) ఒక ప్రకటనలో ప్రకటించింది. అత్యవసర మరియు అగ్నిమాపక బృందాలను వెంటనే రంగంలోకి దించినట్లు KPC తెలిపింది. ప్రత్యేక బృందాలు మంటలను అదుపులోకి తీసుకురావడానికి మరియు అవి రిఫైనరీలోని ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించడానికి సమర్థవంతంగా పనిచేశాయని తెలిపింది.ఈ ఘటనలో ఎటువంటి గాయాలు కాలేదని కార్పొరేషన్ ధృవీకరించింది.
కార్మికుల భద్రతను నిర్ధారించడానికి మరియు ప్రాంగణాన్ని కాపాడటానికి అవసరమైన అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు కూడా పేర్కొంది. రిఫైనరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు పర్యావరణ ప్రజా ప్రాధికార సంస్థతో సమన్వయం చేసుకుంటున్నట్లు కేపీసీ పేర్కొంది. ఈ ఘటన ఫలితంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రతికూల పర్యావరణ ఘటన నెలకొనలేదని తెలిపింది.
నిరంతరాయ కార్యకలాపాలు కొనసాగేలా.. ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆ సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









