మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- April 03, 2026
కువైట్: కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (KNPC) నిర్వహిస్తున్న మీనా అల్-అహ్మది రిఫైనరీపై శుక్రవారం తెల్లవారుజామున డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఆ ప్రాంగణంలోని పలు ఆఫరేషనల్ యూనిట్స్ లో మంటలు చెలరేగాయని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) ఒక ప్రకటనలో ప్రకటించింది. అత్యవసర మరియు అగ్నిమాపక బృందాలను వెంటనే రంగంలోకి దించినట్లు KPC తెలిపింది. ప్రత్యేక బృందాలు మంటలను అదుపులోకి తీసుకురావడానికి మరియు అవి రిఫైనరీలోని ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించడానికి సమర్థవంతంగా పనిచేశాయని తెలిపింది.ఈ ఘటనలో ఎటువంటి గాయాలు కాలేదని కార్పొరేషన్ ధృవీకరించింది.
కార్మికుల భద్రతను నిర్ధారించడానికి మరియు ప్రాంగణాన్ని కాపాడటానికి అవసరమైన అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు కూడా పేర్కొంది. రిఫైనరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు పర్యావరణ ప్రజా ప్రాధికార సంస్థతో సమన్వయం చేసుకుంటున్నట్లు కేపీసీ పేర్కొంది. ఈ ఘటన ఫలితంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రతికూల పర్యావరణ ఘటన నెలకొనలేదని తెలిపింది.
నిరంతరాయ కార్యకలాపాలు కొనసాగేలా.. ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆ సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







