ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- April 03, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. వేసవి ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం విలవిలలాడుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 42°C నుండి 43°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
గురువారం నమోదైన గణాంకాల ప్రకారం.. విజయనగరం జిల్లా రాజాంలో అత్యధికంగా 40.6°C ఉష్ణోగ్రత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, చిత్తూరు జిల్లా నిండ్రలో 40°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది:
శుక్రవారం (ఏప్రిల్ 3): రాష్ట్రవ్యాప్తంగా 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 16 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
శనివారం (ఏప్రిల్ 4): 41 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 21 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అంచనా.
ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలు మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకపోవడమే మంచిదని తెలిపారు. సరిపడా నీరు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!







