ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- April 04, 2026
కువైట్ః ఒక విద్యుత్ ఉత్పాదన మరియు నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ డ్రోన్ దాడి జరిగిందని, ఆ సదుపాయంలోని కొన్ని భాగాలకు నష్టం వాటిల్లిందని కువైట్ విద్యుత్, జల మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటన అనంతర పరిణామాలను ఎదుర్కోవడానికి అత్యవసర మరియు సాంకేతిక బృందాలను వెంటనే రంగంలోకి దించినట్లు మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, ఇంజనీర్ ఫాతిమా అబ్బాస్ జవహర్ హయత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరారు. పుకార్లను వ్యాప్తి చేయవద్దని అన్నారు. తాజా సమాచారాన్ని అందించడంలో మంత్రిత్వ శాఖ పారదర్శకతకు కట్టుబడి ఉందని హయత్ పునరుద్ఘాటించారు.
ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి మరియు కీలకమైన సేవల నిరంతర సరఫరాను నిర్ధారించడానికి సాంకేతిక బృందాలు అత్యంత సమర్థవంతంగా నిరంతరం పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









