ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- April 04, 2026
కువైట్ః ఒక విద్యుత్ ఉత్పాదన మరియు నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ డ్రోన్ దాడి జరిగిందని, ఆ సదుపాయంలోని కొన్ని భాగాలకు నష్టం వాటిల్లిందని కువైట్ విద్యుత్, జల మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటన అనంతర పరిణామాలను ఎదుర్కోవడానికి అత్యవసర మరియు సాంకేతిక బృందాలను వెంటనే రంగంలోకి దించినట్లు మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, ఇంజనీర్ ఫాతిమా అబ్బాస్ జవహర్ హయత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరారు. పుకార్లను వ్యాప్తి చేయవద్దని అన్నారు. తాజా సమాచారాన్ని అందించడంలో మంత్రిత్వ శాఖ పారదర్శకతకు కట్టుబడి ఉందని హయత్ పునరుద్ఘాటించారు.
ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి మరియు కీలకమైన సేవల నిరంతర సరఫరాను నిర్ధారించడానికి సాంకేతిక బృందాలు అత్యంత సమర్థవంతంగా నిరంతరం పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కాక్రోచ్ జనతా పార్టీ (CJP)
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
- తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా..
- హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్..
- హైదరాబాద్లో టెస్లా.. త్వరలోనే సేల్స్ సర్వీస్ సెంటర్ ప్రారంభం..
- చౌక ట్రావెల్ ఆఫర్ల పేరుతో మోసాలు..అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఈద్ అల్ అదా సందర్భంగా అబూదాబిలో ఉచిత పార్కింగ్, డార్బ్ టోల్ మినహాయింపు
- సలాలా ఎయిర్పోర్టుకు తొలి ఎతిహాద్ విమానం
- దుబాయ్ ప్రైవేట్ స్కూల్ ఫీజుల్లో పెంపు లేదు
- ఎవరెస్టు పై ఇద్దరు భారతీయుల మృతి









