ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- April 04, 2026
దోహార్: పిల్లల భద్రతను నిర్ధారించడానికి, తల్లిదండ్రులు మరియు సంరక్షకులు పిల్లల భద్రతా మార్గదర్శకాలను పాటించాలని, వారిని ప్రమాదాల నుండి రక్షించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) సూచించింది.
ఈ మేరకు సోషల్ మీడియాలో పంచుకున్న ఒక పోస్ట్లో.. పిల్లలు మునిగిపోకుండా నిరోధించడానికి స్విమ్మింగ్ పూల్స్లో ఉన్నప్పుడు వారిని పర్యవేక్షించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను వాహనాల్లో ముందు సీట్లలో కూర్చోబెట్టడం, వాహనాల్లో వారిని ఒంటరిగా వదిలివేయడం మరియు ఆట, వినోద ప్రదేశాలలో వారిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని కూడా మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
అత్యవసర పరిస్థితులలో పిల్లలతో ప్రశాంతంగా, అవగాహనతో వ్యవహరించాలని సూచించింది. అలాగే వారి వయస్సుకు తగిన ఎలక్ట్రానిక్ గేమ్లను ఎంచుకునేలా చూడాలని తల్లిదండ్రులకు సలహా ఇచ్చింది.
ఈ మార్గదర్శకాలను పాటించడం వల్ల ప్రమాదాలను తగ్గించి, పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించవచ్చని MOI పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









