మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!

- April 05, 2026 , by Maagulf
మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!

రియాద్: సౌదీ అరేబియాలో ప్రైమరీ, ఎర్లీ చైల్డ్ హుడ్ విద్యలో కొత్త విద్యార్థుల నమోదు ప్రక్రియ ఆదివారం నుండి ప్రారంభమైందని విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. COVID-19 మహమ్మారి సమయంలో జన్మించిన విద్యార్థులు, ప్రవేశానికి నిర్దేశించిన వయోపరిమితి ప్రమాణాలను కలిగి ఉన్నట్లయితే, వారు అధికారికంగా విద్యాభ్యాసంలో చేరడానికి అర్హులని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఆగస్టు 24, 2020 నాటికి ఆరు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు నిండిన పిల్లలు మొదటి వర్గంగా (సాధారణ ప్రవేశం కింద) పరిగణించబడతారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రెండవ వర్గంలో ఆరు సంవత్సరాల వయస్సు కంటే గరిష్టంగా 90 రోజుల వరకు తక్కువ వయస్సు ఉన్న పిల్లలు (ముఖ్యంగా ఆగస్టు 25, 2020 మరియు నవంబర్ 22, 2020 మధ్య జన్మించినవారు) చేరడానికి అర్హులు. అయితే వీరు కిండర్‌గార్టెన్ విద్యను పూర్తి సంవత్సరం పాటు విజయవంతంగా పూర్తి చేసి ఉండాలనే షరతు వర్తిస్తుంది.

కిండర్‌గార్టెన్ నమోదు ప్రక్రియ మూడు స్థాయిలుగా విభజించినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. ఆగస్టు 24, 2023 మరియు ఆగస్టు 25, 2022 మధ్య జన్మించిన పిల్లలు లెవెల్ 1 (KG1)కి అర్హులు. ఆగస్టు 24, 2022 మరియు ఆగస్టు 25, 2021 మధ్య జన్మించినవారు లెవెల్ 2 (KG2)కి అర్హులు. లెవెల్ 3 (KG3) అనేది ఆగస్టు 24, 2021 మరియు ఆగస్టు 25, 2020 మధ్య జన్మించిన పిల్లల కోసం నిర్దేశించారు. ఆమోదిత ప్రమాణాలకు అనుగుణంగా, ప్రతి విద్యా దశకు అవసరమైన అర్హతలతో వయోపరిమితి ఆధారిత కేటాయింపులు సముచితంగా ఉండేలా ఈ విధానం తీసుకొచ్చినట్లు సౌదీ అరేబియా వ్యక్తం చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com