యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- April 05, 2026
అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ మరియు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ఆదివారం అబుదాబిలో కీలక భేటీ జరిగింది. ఇటలీ ప్రధాని యూఏఈ పర్యటన సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో తాజా ప్రాంతీయ పరిణామాలు, భద్రతా పరిస్థితులు, సముద్ర రవాణా భద్రత, ఇంధన సరఫరాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం వంటి అంశాల పై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా యూఏఈతో పాటు ప్రాంతంలోని ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఇరాన్ దాడులు, పౌరులు మరియు పౌర మౌలిక వసతులపై దాడులు ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్ర ముప్పుగా మారాయని ఇరు దేశాల నేతలు అభిప్రాయపడ్డారు. ఇవి సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్కు విరుద్ధమని పేర్కొన్నారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఈ దాడులను ఖండిస్తూ, యూఏఈ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలకు ఇటలీ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
భేటీలో యూఏఈ–ఇటలీ మధ్య ఆర్థిక, అభివృద్ధి రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసే అంశాల పై కూడా చర్చించారు. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించి, ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కలిసి పనిచేయాలని ఇరు నేతలు సంకల్పం వ్యక్తం చేశారు.
ఈ సమావేశానికి షేక్ ఖాలెద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్, షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్,షేక్ మొహమ్మద్ బిన్ హేమాడ్ బిన్ తనూన్ అల్ నహ్యాన్ తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు
తాజా వార్తలు
- అవనిగడ్డలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభం
- బస్సులో మరింత భద్రత కోసం TGSRTC కీలక నిర్ణయం
- ఈద్ అల్ అదా ముందు టపాసుల వినియోగంపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- చాట్GPT చూసి బాంబుల తయారీ!
- మరోసారి విజయ్ ప్రభుత్వం పై స్టాలిన్ కౌంటర్
- క్వెట్టా రైల్వే స్టేషన్లో ఘోర ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
- మస్కట్ విమానాశ్రయంలో భారీగా మారిజూన సీజ్..!!
- నైటింగేల్స్ ఆఫ్ బహ్రెయిన్ సర్వీస్ అవార్డ్ 2026 ప్రకటించిన ILA బహ్రెయిన్..!!
- ట్రంప్, అరబ్ లీడర్లతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ కీలక చర్చలు..!!
- ఈద్ అల్ అదా.. యూఏఈ హైపర్మార్కెట్లలో 50% తగ్గింపు ఆఫర్లు..!!









