యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- April 05, 2026
అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ మరియు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ఆదివారం అబుదాబిలో కీలక భేటీ జరిగింది. ఇటలీ ప్రధాని యూఏఈ పర్యటన సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో తాజా ప్రాంతీయ పరిణామాలు, భద్రతా పరిస్థితులు, సముద్ర రవాణా భద్రత, ఇంధన సరఫరాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం వంటి అంశాల పై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా యూఏఈతో పాటు ప్రాంతంలోని ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఇరాన్ దాడులు, పౌరులు మరియు పౌర మౌలిక వసతులపై దాడులు ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్ర ముప్పుగా మారాయని ఇరు దేశాల నేతలు అభిప్రాయపడ్డారు. ఇవి సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్కు విరుద్ధమని పేర్కొన్నారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఈ దాడులను ఖండిస్తూ, యూఏఈ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలకు ఇటలీ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
భేటీలో యూఏఈ–ఇటలీ మధ్య ఆర్థిక, అభివృద్ధి రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసే అంశాల పై కూడా చర్చించారు. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించి, ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కలిసి పనిచేయాలని ఇరు నేతలు సంకల్పం వ్యక్తం చేశారు.
ఈ సమావేశానికి షేక్ ఖాలెద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్, షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్,షేక్ మొహమ్మద్ బిన్ హేమాడ్ బిన్ తనూన్ అల్ నహ్యాన్ తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







