డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- April 06, 2026
కువైట్ః కువైట్ ఆర్థిక మంత్రి యాకూబ్ అల్-రిఫాయ్.. డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయ భవనాన్ని పరిశీలించారు. ఈ దాడిని ఆయన హేయమైన ఇరాన్ దురాక్రమణగా అభివర్ణించారు. తన పర్యటన సందర్భంగా అల్-రిఫాయ్ దాడి వల్ల జరిగిన నష్టాన్ని సమీక్షించారు.వీలైనంత త్వరగా ఆ ప్రాంగణాన్ని పునరుద్ధరించడానికి మరమ్మత్తు మరియు పునరావాస పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యకలాపాలు ఆలస్యం లేకుండా సాధారణ స్థితికి వచ్చేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా అత్యవసర బృందాల వేగవంతమైన స్పందనను మంత్రి అభినందించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అసిల్ అల్-మునిఫీ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









