డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!

- April 06, 2026 , by Maagulf
డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!

కువైట్ః కువైట్ ఆర్థిక మంత్రి యాకూబ్ అల్-రిఫాయ్.. డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయ భవనాన్ని పరిశీలించారు. ఈ దాడిని ఆయన హేయమైన ఇరాన్ దురాక్రమణగా అభివర్ణించారు. తన పర్యటన సందర్భంగా అల్-రిఫాయ్ దాడి వల్ల జరిగిన నష్టాన్ని సమీక్షించారు.వీలైనంత త్వరగా ఆ ప్రాంగణాన్ని పునరుద్ధరించడానికి మరమ్మత్తు మరియు పునరావాస పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యకలాపాలు ఆలస్యం లేకుండా సాధారణ స్థితికి వచ్చేలా చూడాలన్నారు.  ఈ సందర్భంగా అత్యవసర బృందాల వేగవంతమైన స్పందనను మంత్రి అభినందించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అసిల్ అల్-మునిఫీ కూడా ఉన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com