నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- April 07, 2026
మనామా: నకిలీ కరెన్సీ కలిగి ఉన్న 48 ఏళ్ల వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.అలాగే, BD500 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సదరు వ్యక్తిపై మాదకద్రవ్యాలకు సంబంధించిన ఒక కేసు నమోదు అయిందని, అతడి నుంచి స్వాధీనం చేసుకున్న నగదులో నకిలీ 500 సౌదీ రియాల్ నోటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనితో, కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా.. నిందితుడి పంపిణీ చేసే ఉద్దేశంతోనే ఆ నకిలీ 500 రియాల్ నోటును కలిగి ఉన్నట్లు వెల్లడైంది.
నిందితుడిని 2025 ఆగస్టు 9న మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణపై 'డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం' అరెస్టు చేసిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక పోలీసు అధికారి తెలిపారు. ఆస్తుల అప్పగింత సమయంలో సదరు నకిలీ నోటు బయటపడిందన్నారు. BD30 చెల్లించి తెలియని ఒక వ్యక్తి నుండి ఆ నకిలీ నోటును తీసుకున్నట్లు నిందితుడు విచారణ సందర్భంగా వెల్లడించాడని అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







