నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- April 07, 2026
మనామా: నకిలీ కరెన్సీ కలిగి ఉన్న 48 ఏళ్ల వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.అలాగే, BD500 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సదరు వ్యక్తిపై మాదకద్రవ్యాలకు సంబంధించిన ఒక కేసు నమోదు అయిందని, అతడి నుంచి స్వాధీనం చేసుకున్న నగదులో నకిలీ 500 సౌదీ రియాల్ నోటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనితో, కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా.. నిందితుడి పంపిణీ చేసే ఉద్దేశంతోనే ఆ నకిలీ 500 రియాల్ నోటును కలిగి ఉన్నట్లు వెల్లడైంది.
నిందితుడిని 2025 ఆగస్టు 9న మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణపై 'డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం' అరెస్టు చేసిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక పోలీసు అధికారి తెలిపారు. ఆస్తుల అప్పగింత సమయంలో సదరు నకిలీ నోటు బయటపడిందన్నారు. BD30 చెల్లించి తెలియని ఒక వ్యక్తి నుండి ఆ నకిలీ నోటును తీసుకున్నట్లు నిందితుడు విచారణ సందర్భంగా వెల్లడించాడని అన్నారు.
తాజా వార్తలు
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం









