నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- April 07, 2026
మనామా: నకిలీ కరెన్సీ కలిగి ఉన్న 48 ఏళ్ల వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.అలాగే, BD500 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సదరు వ్యక్తిపై మాదకద్రవ్యాలకు సంబంధించిన ఒక కేసు నమోదు అయిందని, అతడి నుంచి స్వాధీనం చేసుకున్న నగదులో నకిలీ 500 సౌదీ రియాల్ నోటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనితో, కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా.. నిందితుడి పంపిణీ చేసే ఉద్దేశంతోనే ఆ నకిలీ 500 రియాల్ నోటును కలిగి ఉన్నట్లు వెల్లడైంది.
నిందితుడిని 2025 ఆగస్టు 9న మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణపై 'డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం' అరెస్టు చేసిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక పోలీసు అధికారి తెలిపారు. ఆస్తుల అప్పగింత సమయంలో సదరు నకిలీ నోటు బయటపడిందన్నారు. BD30 చెల్లించి తెలియని ఒక వ్యక్తి నుండి ఆ నకిలీ నోటును తీసుకున్నట్లు నిందితుడు విచారణ సందర్భంగా వెల్లడించాడని అన్నారు.
తాజా వార్తలు
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్









