నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- April 07, 2026
మనామా: నకిలీ కరెన్సీ కలిగి ఉన్న 48 ఏళ్ల వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.అలాగే, BD500 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సదరు వ్యక్తిపై మాదకద్రవ్యాలకు సంబంధించిన ఒక కేసు నమోదు అయిందని, అతడి నుంచి స్వాధీనం చేసుకున్న నగదులో నకిలీ 500 సౌదీ రియాల్ నోటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనితో, కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా.. నిందితుడి పంపిణీ చేసే ఉద్దేశంతోనే ఆ నకిలీ 500 రియాల్ నోటును కలిగి ఉన్నట్లు వెల్లడైంది.
నిందితుడిని 2025 ఆగస్టు 9న మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణపై 'డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం' అరెస్టు చేసిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక పోలీసు అధికారి తెలిపారు. ఆస్తుల అప్పగింత సమయంలో సదరు నకిలీ నోటు బయటపడిందన్నారు. BD30 చెల్లించి తెలియని ఒక వ్యక్తి నుండి ఆ నకిలీ నోటును తీసుకున్నట్లు నిందితుడు విచారణ సందర్భంగా వెల్లడించాడని అన్నారు.
తాజా వార్తలు
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!







