పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- April 07, 2026
దమ్మామ్: ప్రయాణికులకు వేగవంతమైన సేవలను అందించడానికి పాస్పోర్ట్స్ డైరెక్టరేట్.. తూర్పు ప్రావిన్స్లోని కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ వద్ద సిబ్బంది కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అత్యంత రద్దీగా ఉండే సరిహద్దు క్రాసింగ్లలో ఒకటైన కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ప్రక్రియలను వేగవంత చేసేందుకు వీలుగా ప్రవేశపెట్టిన స్మార్ట్ పరిష్కారాలలో ఈ చొరవ ఒక భాగమని పేర్కొన్నది. ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం, ముఖ్యంగా వృద్ధ ప్రయాణికులకు మరియు వికలాంగులకు సహాయపడుతుందని, వారి రాకపోకలను సులభతరం చేయడంతోపాటు సేవా నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుందన్నారు.
ఇది లేన్లు మరియు గేట్ల ద్వారా వాహనాల రాకపోకలను మెరుగ్గా నియంత్రించడానికి దోహదపడటంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతంగా ప్రతిస్పందించేందుకు కూడా ఉపయోగపడుతుందన్నారు. సరిహద్దు కార్యకలాపాలను ఆధునీకరించేందుకు జరుగుతున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా, సౌదీ అరేబియా అన్ని పోర్టులలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగాన్ని విస్తరించడానికి సన్నాహాలు చేస్తోందని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







