పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- April 07, 2026
దమ్మామ్: ప్రయాణికులకు వేగవంతమైన సేవలను అందించడానికి పాస్పోర్ట్స్ డైరెక్టరేట్.. తూర్పు ప్రావిన్స్లోని కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ వద్ద సిబ్బంది కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అత్యంత రద్దీగా ఉండే సరిహద్దు క్రాసింగ్లలో ఒకటైన కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ప్రక్రియలను వేగవంత చేసేందుకు వీలుగా ప్రవేశపెట్టిన స్మార్ట్ పరిష్కారాలలో ఈ చొరవ ఒక భాగమని పేర్కొన్నది. ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం, ముఖ్యంగా వృద్ధ ప్రయాణికులకు మరియు వికలాంగులకు సహాయపడుతుందని, వారి రాకపోకలను సులభతరం చేయడంతోపాటు సేవా నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుందన్నారు.
ఇది లేన్లు మరియు గేట్ల ద్వారా వాహనాల రాకపోకలను మెరుగ్గా నియంత్రించడానికి దోహదపడటంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతంగా ప్రతిస్పందించేందుకు కూడా ఉపయోగపడుతుందన్నారు. సరిహద్దు కార్యకలాపాలను ఆధునీకరించేందుకు జరుగుతున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా, సౌదీ అరేబియా అన్ని పోర్టులలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగాన్ని విస్తరించడానికి సన్నాహాలు చేస్తోందని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









