ఐఎస్ వాళ్లమంటూ భారతీయ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి
- August 04, 2016
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదివంటూ అమెరికాలో భారతీయ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. ఒమాహా పట్టణంలోని భారతీయ రెస్టారెంట్లో సుతాహర్ సుబ్బురాజ్ అనే వంటమనిషి పనిచేస్తున్నారు. చెత్త బయటపడేస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి సుబ్బురాజ్పై దాడి చేశాడు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దేశ విడిచివెళ్లిపోవాలంటూ అభ్యంతరకమైన మాటలతో తిట్టాడు. తల, ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ.. కాలితో తన్నాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. ఈ దాడిని హిందూ అమెరికా సంస్థలు తీవ్రంగా ఖండించాయి. దీన్ని జాతి వ్యతిరేక దాడిగా అభివర్ణించింది. దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాల ప్రజలపై అనవసర భయాందోళనలు పెంచుకొని దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









