దక్షిణ భారత్లో తొలి డాప్లర్ వాతావరణ రాడార్ ప్రారంభించిన స్రో ఛైర్మన్ కిరణ్కుమార్
- August 04, 2016
తుపాన్లతోపాటు, ఇతర తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని అందించే డాప్లర్ రాడార్ను ప్రారంభించారు. గురువారమిక్కడి విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం(వీఎస్ఎస్సీ)లో ఇస్రో ఛైర్మన్ ఎ.ఎస్.కిరణ్కుమార్ 'సి బ్యాండ్ పోలారిమెట్రిక్ డాప్లర్ వాతావరణ రాడార్'ను ప్రారంభించారు. ఈ రాడార్ నుంచి సమాచారం భారత వాతావరణ విభాగానికి అందుబాటులోకి వస్తుందని కిరణ్కుమార్ పేర్కొన్నారు. ఈ తరహాలో దక్షిణ భారత్లో ఏర్పాటు చేసిన తొలి రాడార్ ఇదేనని వీఎస్ఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇస్రో, బీహెచ్ఈఎల్ రూపొందించిన తొలి వాతావరణ రాడార్ను మేలో ప్రధాని నరేంద్రమోదీ మేఘాలయ చిరపుంజిలో ఆవిష్కరించారు. భుజ్, గోపాల్పూర్లలో ఏర్పాటు చేయనున్న మరో రెండు డాప్లర్ రాడార్లకు సంబంధించిన పనులు సాగుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







