సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!
- April 10, 2026
దోహా: ఖతార్ లో వాణిజ్య మోసాలు, ధరల పెరుగుదలపై వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) కొరడా ఝులిపిస్తోంది. ఇందులో భాగంగా అధికారులు ఓ సెంట్రల్ మార్కెట్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులను మోసం చేస్తున్న సంస్థలపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించింది.
అధిక ధరలు, తూకాల్లో మోసాలతో కస్టమర్లను మోసం చేస్తున్న అల్ సైలియా సెంట్రల్ మార్కెట్ ఫర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్పై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి, మార్కెట్ లలో పారదర్శకత కోసం నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అలాగే, ఏవైనా వాణిజ్య మోసాలను 16001 నంబర్ ద్వారా తెలియజేయాలని ప్రజలకు మంత్రిత్వశాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







