సెంట్రల్ మార్కెట్‌ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!

- April 10, 2026 , by Maagulf
సెంట్రల్ మార్కెట్‌ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!

దోహా: ఖతార్ లో వాణిజ్య మోసాలు, ధరల పెరుగుదలపై వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) కొరడా ఝులిపిస్తోంది. ఇందులో భాగంగా అధికారులు ఓ సెంట్రల్ మార్కెట్‌లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులను మోసం చేస్తున్న సంస్థలపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించింది.
అధిక ధరలు, తూకాల్లో మోసాలతో కస్టమర్లను మోసం చేస్తున్న అల్ సైలియా సెంట్రల్ మార్కెట్ ఫర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్‌పై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి, మార్కెట్ లలో పారదర్శకత కోసం నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అలాగే, ఏవైనా వాణిజ్య మోసాలను 16001 నంబర్ ద్వారా తెలియజేయాలని ప్రజలకు మంత్రిత్వశాఖ పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com