సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!
- April 10, 2026
దోహా: ఖతార్ లో వాణిజ్య మోసాలు, ధరల పెరుగుదలపై వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) కొరడా ఝులిపిస్తోంది. ఇందులో భాగంగా అధికారులు ఓ సెంట్రల్ మార్కెట్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులను మోసం చేస్తున్న సంస్థలపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించింది.
అధిక ధరలు, తూకాల్లో మోసాలతో కస్టమర్లను మోసం చేస్తున్న అల్ సైలియా సెంట్రల్ మార్కెట్ ఫర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్పై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి, మార్కెట్ లలో పారదర్శకత కోసం నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అలాగే, ఏవైనా వాణిజ్య మోసాలను 16001 నంబర్ ద్వారా తెలియజేయాలని ప్రజలకు మంత్రిత్వశాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- షార్జాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..నవజాత శిశువుతోపాటు ఫ్యామిలీ సేఫ్..!!
- మే నెలలో 4వెలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించిన LMRA..!!
- మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- జూన్లో సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!









