సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!
- April 10, 2026
దోహా: ఖతార్ లో వాణిజ్య మోసాలు, ధరల పెరుగుదలపై వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) కొరడా ఝులిపిస్తోంది. ఇందులో భాగంగా అధికారులు ఓ సెంట్రల్ మార్కెట్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులను మోసం చేస్తున్న సంస్థలపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించింది.
అధిక ధరలు, తూకాల్లో మోసాలతో కస్టమర్లను మోసం చేస్తున్న అల్ సైలియా సెంట్రల్ మార్కెట్ ఫర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్పై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి, మార్కెట్ లలో పారదర్శకత కోసం నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అలాగే, ఏవైనా వాణిజ్య మోసాలను 16001 నంబర్ ద్వారా తెలియజేయాలని ప్రజలకు మంత్రిత్వశాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్ను జయించి..మారథాన్ రన్నర్గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- సౌదీలో రోజుకు సుమారు 700,000 బ్యారెళ్ల ఉత్పత్తి నష్టం..!!
- కోరల్ రిఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎన్విరాన్ మెంట్ అథారిటీ..!!









