సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!
- April 10, 2026
దోహా: ఖతార్ లో వాణిజ్య మోసాలు, ధరల పెరుగుదలపై వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) కొరడా ఝులిపిస్తోంది. ఇందులో భాగంగా అధికారులు ఓ సెంట్రల్ మార్కెట్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులను మోసం చేస్తున్న సంస్థలపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించింది.
అధిక ధరలు, తూకాల్లో మోసాలతో కస్టమర్లను మోసం చేస్తున్న అల్ సైలియా సెంట్రల్ మార్కెట్ ఫర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్పై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి, మార్కెట్ లలో పారదర్శకత కోసం నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అలాగే, ఏవైనా వాణిజ్య మోసాలను 16001 నంబర్ ద్వారా తెలియజేయాలని ప్రజలకు మంత్రిత్వశాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









