నగదు టోల్కు గుడ్బై..FASTag/UPI తప్పనిసరి
- April 10, 2026
హైదరాబాద్: ఏప్రిల్10 దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. నేటి (శుక్రవారం) నుంచి టోల్ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేస్తూ కొత్త విధానాన్ని అమలు చేశారు. ఇకపై వాహనదారులు తప్పనిసరిగా FASTag లేదా UPI ద్వారా మాత్రమే టోల్ చెల్లించాల్సి ఉంటుంది.
టోల్ సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నగదు చెల్లింపులు నిలిపివేయడంతో టోల్ప్లాజాల వద్ద క్యూలు తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతుందని భావిస్తున్నారు.
ఈ మార్పులతో పాటు టోల్ ఛార్జీల్లో కూడా పెంపు జరిగింది. సగటున 10% వరకు టోల్ రేట్లు పెరిగాయి. ముఖ్యంగా ఎక్స్ప్రెస్వేల్లో 1.5% నుంచి 3.5% వరకు పెంపు అమలులోకి వచ్చింది. అలాగే, తరచూ ప్రయాణించే వాహనదారుల కోసం వార్షిక టోల్ పాస్ ధరను రూ.3,075గా నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో వాహనదారులు ముందుగానే తమ వాహనాలకు FASTag అమలు చేయించుకోవడం లేదా UPI సదుపాయం సిద్ధంగా ఉంచుకోవడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







