దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- April 11, 2026
దోహాః మిడిలీస్టు వార్ ఎఫెక్ట్ తో ప్రపంచ ఇంధన పరిశ్రమ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఖతార్ ఇంధన వ్యవహారాల సహాయ మంత్రి సాద్ అల్-కాబీ, భారత పెట్రోలియం మరియు సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ శుక్రవారం దోహాలో సమావేశమై, చర్చలు జరిపారు. భారత్తో ఇంధన సంబంధాలను బలోపేతం చేయడానికి ఎదురుచూస్తున్నట్లు అల్-కాబీ తెలిపారు. అలాగే, అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణను ఇరు దేశాల మంత్రులు స్వాగతించారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరపున భారత మంత్రి, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి, అలాగే ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థానీకి విడిగా సందేశాలను అందజేశారు.
మార్చి 2న రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలోఖతార్ ఎనర్జీ ద్రవీకృత సహజ వాయువు (LNG) ఉత్పత్తిని నిలిపివేసింది. మార్చి 4న, ఖతార్ ఎనర్జీ ప్రభావితమైన తన కొనుగోలుదారులకు ఫోర్స్ మేజర్ ప్రకటించింది. భారత్ కు LNG మరియు LPGలను సరఫరా చేసే అతిపెద్ద ఏకైక దేశం ఖతార్. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. భారతదేశం తన LNG సరఫరాలలో 45 శాతం, LPG సరఫరాలలో 20 శాతం కోసం ఖతార్పై ఆధారపడుతుంది.
తాజా వార్తలు
- కర్ణాటకలో గుట్కా, పాన్ మసాలా పై నిషేధం
- షార్జాలో మట్టితో నంబర్ ప్లేట్ దాచిన డ్రైవర్ అరెస్ట్..!!
- సౌదీలో భారీగా ఖాట్, హషీష్ స్వాధీనం.. 8 మంది అరెస్ట్..!!
- సలాలాలో ఫుడ్ సెక్యూరిటీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- కొవ్వొత్తి మంటతో రూమ్మేట్ మృతి.. మహిళకు ఏడాది జైలు..!!
- నాన్-హైడ్రోకార్బన్ రంగాల వృద్ధి..ఖతార్ ఆర్థిక వ్యవస్థకు బలం..!!
- శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీ భక్తులకు గుడ్న్యూస్..
- సింక్ఫీల్డ్ కప్లో ఆర్ ప్రజ్ఞానంద సంచలన విజయం
- చంద్రశేఖరన్ రిజైన్.. టాటా గ్రూప్ షేర్లు పతనం
- అబుదాబి మాల్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ సందర్శన







