దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- April 11, 2026
దోహాః మిడిలీస్టు వార్ ఎఫెక్ట్ తో ప్రపంచ ఇంధన పరిశ్రమ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఖతార్ ఇంధన వ్యవహారాల సహాయ మంత్రి సాద్ అల్-కాబీ, భారత పెట్రోలియం మరియు సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ శుక్రవారం దోహాలో సమావేశమై, చర్చలు జరిపారు. భారత్తో ఇంధన సంబంధాలను బలోపేతం చేయడానికి ఎదురుచూస్తున్నట్లు అల్-కాబీ తెలిపారు. అలాగే, అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణను ఇరు దేశాల మంత్రులు స్వాగతించారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరపున భారత మంత్రి, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి, అలాగే ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థానీకి విడిగా సందేశాలను అందజేశారు.
మార్చి 2న రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలోఖతార్ ఎనర్జీ ద్రవీకృత సహజ వాయువు (LNG) ఉత్పత్తిని నిలిపివేసింది. మార్చి 4న, ఖతార్ ఎనర్జీ ప్రభావితమైన తన కొనుగోలుదారులకు ఫోర్స్ మేజర్ ప్రకటించింది. భారత్ కు LNG మరియు LPGలను సరఫరా చేసే అతిపెద్ద ఏకైక దేశం ఖతార్. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. భారతదేశం తన LNG సరఫరాలలో 45 శాతం, LPG సరఫరాలలో 20 శాతం కోసం ఖతార్పై ఆధారపడుతుంది.
తాజా వార్తలు
- షార్జాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..నవజాత శిశువుతోపాటు ఫ్యామిలీ సేఫ్..!!
- మే నెలలో 4వెలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించిన LMRA..!!
- మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- జూన్లో సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!









