వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- April 11, 2026
హైదరాబాద్: హైదరాబాద్ లో వాటర్ బోర్డు బిల్లుల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. వాటర్ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామని భయపెట్టి వినియోగదారులను దోచుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఈ మేరకు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నేరగాళ్లు బాధితులకు మెసేజ్ పంపి HMWSSB WATER BILL UPDATE.apk పేరుతో ఉన్న ఒక లింక్ను ఇన్స్టాల్ చేయమని కోరుతున్నారని సీపీ పేర్కొన్నారు. ఈ ఏపీకే ఫైల్ను మొబైల్లో ఇన్స్టాల్ చేసిన వెంటనే, ఫోన్ నియంత్రణ పూర్తిగా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని హెచ్చరించారు. దీనివల్ల బాధితుల బ్యాంక్ ఖాతాల వివరాలు, ఓటీపీలు నేరగాళ్లకు తెలిసిపోయి డబ్బులు మాయమవుతున్నాయని తెలిపారు.
ప్రజలు ఇలాంటి బెదిరింపులకు భయపడకుండా జాగ్రత్త వహించాలని సీపీ సజ్జనార్ కోరారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఏపీకే ఫైళ్లను, సాఫ్ట్వేర్ లింక్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇన్స్టాల్ చేయవద్దని సూచించారు. వాటర్ బిల్లు చెల్లింపుల కోసం అధికారిక వెబ్సైట్ లేదా యాప్లను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- Kuwait: Fire breaks out at power generation, water desalination plant following Iranian attack
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!







