స్పెయిన్ లో 'మిస్టర్' షూట్ ముగిసింది..

- August 04, 2016 , by Maagulf
స్పెయిన్ లో 'మిస్టర్'  షూట్ ముగిసింది..

శ్రీను వైట్ల -వరుణ్ తేజ కలయికలో తెరకెక్కుటున్న చిత్రం మిస్టర్ . ఈ సినిమా తొలి షెడ్యూలు ను స్పెయిన్ లో షూట్ చేశారు.దాదాపు నెల రోజుల పాటు అక్కడ షూటింగ్ జరిగింది. ఇప్పుడీ షెడ్యూలు ముగిసింది. ఈ షెడ్యూలో దాదాపు నలఫై శాతం టాకీ పార్ట్ ముగిసిందని చిత్ర యూనిట్ చెప్పింది. త్వరలోనే హైదరాబాద్ లో రెండో షెడ్యూలు ప్రారభింస్తారు. ఈ చిత్రంలో వరుణ్ కు జోడిగా లావణ్య త్రిపాఠీ, హెబ్బా పటేల్ నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా శ్రీను వైట్ల కి చాలా కీలకం. వరుస పరాజయలాతో రేసులో వెనకబడ్డాడు వైట్ల. అయితే ఇప్పుడు దర్శకుడిగా ఆయన కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓ హిట్టు పడాలంతే. ఆ హిట్ 'మిస్టర్' తో వస్తుందని కాన్ఫిడెంట్ గా వున్నాడు వైట్ల.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com