భారత్కు ఇరాన్ భరోసా
- April 14, 2026
భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ ఒక కీలక ప్రకటన చేశారు. అమెరికా నౌకాదళం హార్ముజ్ జలసంధిని దిగ్బంధించినా, భారతీయ నౌకలకు ఈ మార్గం ఎప్పుడూ తెరిచే ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇరాన్ మరియు భారత్ మధ్య ఉన్న చారిత్రక మరియు సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇస్లామాబాద్లో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడానికి అమెరికా మొండివైఖరే కారణమని ఇరాన్ ఆరోపించింది. ఇరాన్ను లొంగదీసుకోవాలనే లక్ష్యంతోనే అమెరికా చర్చలకు వచ్చిందని, 2018లో అణు ఒప్పందం నుండి అమెరికా వైదొలగడం వల్ల ఏర్పడిన అపనమ్మకం ఇంకా కొనసాగుతోందని ఫతాలీ గుర్తు చేశారు. చర్చల సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఫోన్లో మాట్లాడారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే అమెరికా చర్చలను పక్కదారి పట్టించిందని ఇరాన్ గట్టిగా నమ్ముతోంది. ఇస్లామాబాద్లో చర్చలు విఫలం కావడం వెనుక ఇజ్రాయెల్ ప్రమేయం ఉన్నట్లు ఇరాన్ ఆరోపణలు చేస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు ఫోన్ చేశారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసమే అమెరికా ఈ చర్చలను పక్కదారి పట్టించిందని విమర్శించారు. యుద్ధం నుంచి సాధించలేని దాన్ని అమెరికా చర్చలతో సాధించాలని చూసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







