భారత్కు ఇరాన్ భరోసా
- April 14, 2026
భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ ఒక కీలక ప్రకటన చేశారు. అమెరికా నౌకాదళం హార్ముజ్ జలసంధిని దిగ్బంధించినా, భారతీయ నౌకలకు ఈ మార్గం ఎప్పుడూ తెరిచే ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇరాన్ మరియు భారత్ మధ్య ఉన్న చారిత్రక మరియు సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇస్లామాబాద్లో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడానికి అమెరికా మొండివైఖరే కారణమని ఇరాన్ ఆరోపించింది. ఇరాన్ను లొంగదీసుకోవాలనే లక్ష్యంతోనే అమెరికా చర్చలకు వచ్చిందని, 2018లో అణు ఒప్పందం నుండి అమెరికా వైదొలగడం వల్ల ఏర్పడిన అపనమ్మకం ఇంకా కొనసాగుతోందని ఫతాలీ గుర్తు చేశారు. చర్చల సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఫోన్లో మాట్లాడారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే అమెరికా చర్చలను పక్కదారి పట్టించిందని ఇరాన్ గట్టిగా నమ్ముతోంది. ఇస్లామాబాద్లో చర్చలు విఫలం కావడం వెనుక ఇజ్రాయెల్ ప్రమేయం ఉన్నట్లు ఇరాన్ ఆరోపణలు చేస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు ఫోన్ చేశారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసమే అమెరికా ఈ చర్చలను పక్కదారి పట్టించిందని విమర్శించారు. యుద్ధం నుంచి సాధించలేని దాన్ని అమెరికా చర్చలతో సాధించాలని చూసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!









