షార్జాలో విద్యాసంస్థల పునఃప్రారంభం
- April 15, 2026
షార్జా: షార్జాలోని ప్రైవేట్ పాఠశాలలు మరియు నర్సరీలకు సంబంధించి షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ (SPEA) కీలక ప్రకటన చేసింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, దశలవారీగా విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
ప్రకటనలోని ముఖ్యాంశాలు:
షార్జాలోని ప్రైవేట్ పాఠశాలలు మరియు నర్సరీలలో పనిచేసే బోధన మరియు పరిపాలనా సిబ్బంది అందరూ ఈరోజు (ఏప్రిల్ 15, బుధవారం) నుండి విధులకు నేరుగా (In-person) హాజరుకావాలని ఆదేశించారు.
విధులకు హాజరైన సిబ్బందికి అత్యవసర పరిస్థితులు మరియు విపత్తు నిర్వహణ (Emergency and Crisis Protocols) పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. పిల్లలు తిరిగి వచ్చే సమయానికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశ్యం.
ప్రభుత్వ భవనాలు మరియు వాణిజ్య సముదాయాలలో ఉన్న నర్సరీలను రేపటి నుండి (ఏప్రిల్ 16, గురువారం) ప్రారంభించడానికి అనుమతినిచ్చారు. అయితే, అక్కడి సిబ్బందికి పైన పేర్కొన్న శిక్షణ పూర్తయిన తర్వాతే పిల్లలను అనుమతించాల్సి ఉంటుంది.
దుబాయ్ (KHDA) నిర్ణయం: దుబాయ్లోని నర్సరీలు (Early Childhood Centres) కూడా ఏప్రిల్ 16 నుండి దశలవారీగా ప్రారంభం కానున్నాయని నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) ధృవీకరించింది.
విద్యాసంస్థలు సాధారణ స్థితికి చేరుకోవడానికి ఇది మొదటి అడుగు. క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తర్వాతే పిల్లలను పాఠశాలలకు అనుమతించాలనేది ప్రభుత్వ ఆలోచన.
--బాజీ షేక్(యూఏఈ)
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







