దుబాయ్ లో తెలంగాణా వాసి మృతి
- August 05, 2016
కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వలస కార్మికుడు దుబాయిలో మరణించాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తాడూరు పంచాయతీ పాపయ్యపల్లికి చెందిన చెన్నవేని రాములు (41) గతేడాది ఉపాధి కోసం దుబాయి వచ్చారు. అక్కడ మరికొందరితో కలసి ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే గురువారం రాత్రి రాములకు తీవ్ర గుండెపోటు వచ్చింది.
దీంతో అతడిని ఆసుపత్రికి తరలించేందుకు సహచరులు ప్రయత్నించారు. కానీ అతడు అప్పటికే మృతి చెందాడు. ఈ మరణవార్తను సహచరులు రాములు కుటుంబసభ్యులకు ఫోన్ లో తెలిపారు. దీంతో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. రాములుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తాజా వార్తలు
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ







