దుబాయ్ లో తెలంగాణా వాసి మృతి

- August 05, 2016 , by Maagulf
దుబాయ్ లో తెలంగాణా వాసి మృతి

 కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వలస కార్మికుడు దుబాయిలో మరణించాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తాడూరు పంచాయతీ పాపయ్యపల్లికి చెందిన చెన్నవేని రాములు (41) గతేడాది ఉపాధి కోసం దుబాయి వచ్చారు​. అక్కడ మరికొందరితో కలసి ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే గురువారం రాత్రి రాములకు తీవ్ర గుండెపోటు వచ్చింది.
దీంతో అతడిని ఆసుపత్రికి తరలించేందుకు సహచరులు ప్రయత్నించారు. కానీ అతడు అప్పటికే మృతి చెందాడు. ఈ మరణవార్తను సహచరులు రాములు కుటుంబసభ్యులకు ఫోన్ లో తెలిపారు. దీంతో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. రాములుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com