ఒమన్ లో బిరుసైన ట్రాఫిక్ జరిమానాలకు సుల్తాన్ కబూస్ ఆమోదం

- August 05, 2016 , by Maagulf
ఒమన్ లో  బిరుసైన ట్రాఫిక్ జరిమానాలకు  సుల్తాన్ కబూస్  ఆమోదం

మస్క్యాట్: ఒమాని పాలకుడు సుల్తాన్ కబూస్ బిన్ సయీద్ రాయల్ డిక్రీ సంఖ్య 38 2016.   ద్వారా కొత్త ట్రాఫిక్ చట్టం సవరణకు గురువారం ఆమోదం తెలిపారు. ఈ సవరణలు ద్వారా రహదారి భద్రతా నిర్ధారించడానికి మరియు మరణాలు మరియు గాయాల సంఖ్య తగ్గించేందుకు బిరుసైన జరిమానాలు విధించడం మరియు  ట్రాఫిక్ జరిమానాలు భారీగా పెరిగాయి. 
మొబైల్ ఫోన్లని ఉపయోగిస్తూ తన  డ్రైవింగ్ ద్వారా ఎవరినైనా వాహనంతో డీ కొంటె  300 రీల్స్ జరిమానా ఉంటుంది. అంతేకాక  ఒక నెల నుంచి రెండు సంవత్సరాల వరకు  జైలు శిక్ష ఎదుర్కొవాల్సి ఉంది.
రోడ్డు మీద ఇతరులకు  హాని చేసిన  డ్రైవర్లకు  ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష మరియు 2000 రీల్స్  జరిమానా విధించనున్నారు. క్రొత్త సవరణల గూర్చి  పూర్తి వివరాలను ఆదివారం వెల్లడి  చేయబడుతుంది.
సవరణలు  2015 లోనే  మంత్రుల కౌన్సిల్ ఆమోదం కాబడింది. కాగా ,తుది ఆమోదం కోసం సుల్తాన్ కబూస్ పంపారు. 2015 లో  ఒమన్ లో  రోడ్డు ప్రమాదాలు  అధిక సంఖ్యలో కలిగి ఉంది.. గత ఏడాది  6.276 వాహనాలు ఒక దానితో ఒకటి  డీ కొన్నట్లు నమోదు కాబడింది ఈ  రోడ్డు ప్రమాదాలలో  675 మరణాలు సంభవించాయి. జూలై అత్యంత మృత్యకుహర  మాసం గత ఏడాది ఆ నెలలో మొత్తం  71 మంది వివిధ  రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com