ఒమన్ లో బిరుసైన ట్రాఫిక్ జరిమానాలకు సుల్తాన్ కబూస్ ఆమోదం
- August 05, 2016
మస్క్యాట్: ఒమాని పాలకుడు సుల్తాన్ కబూస్ బిన్ సయీద్ రాయల్ డిక్రీ సంఖ్య 38 2016. ద్వారా కొత్త ట్రాఫిక్ చట్టం సవరణకు గురువారం ఆమోదం తెలిపారు. ఈ సవరణలు ద్వారా రహదారి భద్రతా నిర్ధారించడానికి మరియు మరణాలు మరియు గాయాల సంఖ్య తగ్గించేందుకు బిరుసైన జరిమానాలు విధించడం మరియు ట్రాఫిక్ జరిమానాలు భారీగా పెరిగాయి.
మొబైల్ ఫోన్లని ఉపయోగిస్తూ తన డ్రైవింగ్ ద్వారా ఎవరినైనా వాహనంతో డీ కొంటె 300 రీల్స్ జరిమానా ఉంటుంది. అంతేకాక ఒక నెల నుంచి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఎదుర్కొవాల్సి ఉంది.
రోడ్డు మీద ఇతరులకు హాని చేసిన డ్రైవర్లకు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష మరియు 2000 రీల్స్ జరిమానా విధించనున్నారు. క్రొత్త సవరణల గూర్చి పూర్తి వివరాలను ఆదివారం వెల్లడి చేయబడుతుంది.
సవరణలు 2015 లోనే మంత్రుల కౌన్సిల్ ఆమోదం కాబడింది. కాగా ,తుది ఆమోదం కోసం సుల్తాన్ కబూస్ పంపారు. 2015 లో ఒమన్ లో రోడ్డు ప్రమాదాలు అధిక సంఖ్యలో కలిగి ఉంది.. గత ఏడాది 6.276 వాహనాలు ఒక దానితో ఒకటి డీ కొన్నట్లు నమోదు కాబడింది ఈ రోడ్డు ప్రమాదాలలో 675 మరణాలు సంభవించాయి. జూలై అత్యంత మృత్యకుహర మాసం గత ఏడాది ఆ నెలలో మొత్తం 71 మంది వివిధ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







