ఒమన్ లో బిరుసైన ట్రాఫిక్ జరిమానాలకు సుల్తాన్ కబూస్ ఆమోదం
- August 05, 2016
మస్క్యాట్: ఒమాని పాలకుడు సుల్తాన్ కబూస్ బిన్ సయీద్ రాయల్ డిక్రీ సంఖ్య 38 2016. ద్వారా కొత్త ట్రాఫిక్ చట్టం సవరణకు గురువారం ఆమోదం తెలిపారు. ఈ సవరణలు ద్వారా రహదారి భద్రతా నిర్ధారించడానికి మరియు మరణాలు మరియు గాయాల సంఖ్య తగ్గించేందుకు బిరుసైన జరిమానాలు విధించడం మరియు ట్రాఫిక్ జరిమానాలు భారీగా పెరిగాయి.
మొబైల్ ఫోన్లని ఉపయోగిస్తూ తన డ్రైవింగ్ ద్వారా ఎవరినైనా వాహనంతో డీ కొంటె 300 రీల్స్ జరిమానా ఉంటుంది. అంతేకాక ఒక నెల నుంచి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఎదుర్కొవాల్సి ఉంది.
రోడ్డు మీద ఇతరులకు హాని చేసిన డ్రైవర్లకు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష మరియు 2000 రీల్స్ జరిమానా విధించనున్నారు. క్రొత్త సవరణల గూర్చి పూర్తి వివరాలను ఆదివారం వెల్లడి చేయబడుతుంది.
సవరణలు 2015 లోనే మంత్రుల కౌన్సిల్ ఆమోదం కాబడింది. కాగా ,తుది ఆమోదం కోసం సుల్తాన్ కబూస్ పంపారు. 2015 లో ఒమన్ లో రోడ్డు ప్రమాదాలు అధిక సంఖ్యలో కలిగి ఉంది.. గత ఏడాది 6.276 వాహనాలు ఒక దానితో ఒకటి డీ కొన్నట్లు నమోదు కాబడింది ఈ రోడ్డు ప్రమాదాలలో 675 మరణాలు సంభవించాయి. జూలై అత్యంత మృత్యకుహర మాసం గత ఏడాది ఆ నెలలో మొత్తం 71 మంది వివిధ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు.
తాజా వార్తలు
- పిల్లల స్క్రీన్ టైమ్పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- సైనిక స్థావరాల్లో రక్షణ మంత్రి తనిఖీలు.. సైన్యం సన్నద్ధతపై సమీక్ష..
- దుబాయ్లో కొత్త అల్ ఖుద్రా బ్రిడ్జి ప్రారంభం..
- బోనాల ఉత్సవాల్లో AI కెమెరాలతో అప్రమత్తమైన నిఘా:సీపీ సజ్జనార్
- రియాద్లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి.. లక్ష్మీనారాయణకు తెలుగు సంఘాల అండ
- వైజాగ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్..







