పుష్కరాల విధుల్లో 17,500 మంది సిబ్బందితో బందోబస్తు..
- August 05, 2016
కృష్ణా పుష్కరాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పుష్కరాల విధుల్లో 17,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని.. మరిన్ని బలగాలు కావాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. పుష్కరఘాట్ల వద్ద అత్యాధునిక సాంకేతికతతో భద్రత, నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రద్దీని అంచనా వేసేందుకు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నామని.. 1300 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. పుష్కరాల్లో 19 మంది ఐపీఎస్ అధికారులు భద్రతను పర్యవేక్షిస్తారని సీపీ తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







