ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- April 17, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోద ముద్ర వేశారు. అనిల్ చంద్ర పునేఠాను ఎస్ఈసీగా నియమిస్తూ ప్రభుత్వం జీఓను విడుదల చేయనుంది. అనిల్ చంద్ర పునేఠా గతంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
గవర్నర్ ఆమోదం లభించడంతో అనిల్ చంద్ర నియామకంపై త్వరలోనే అధికారిక జీఓ జారీ చేయనున్నారు. ఆ తర్వాత.. అనిల్ చంద్ర పునేఠాకు పూర్తి బాధ్యతలు అప్పగించనున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. SECగా అనిల్ చంద్ర నియామకం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
అనిల్ చంద్ర పునేఠా 1984 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయనకు రాష్ట్రంలో వివిధ కీలక శాఖల్లో పనిచేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని సందర్భాల్లో ఎన్నికల సంబంధిత బాధ్యతలు కూడా నిర్వహించారు. జీఓ విడుదలైన వెంటనే అధికారికంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా బాధ్యతలు చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







