ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- April 19, 2026
మనామా: ఇరాన్ చట్టవిరుద్ధమైన దురాక్రమణ ఫలితంగా కలిగిన అన్ని నష్టాలకు ఇరాన్ నుంచి పూర్తి నష్టపరిహారం ఇప్పించాలని ఐక్యరాజ్యసమితికి బహ్రెయిన్ తన పదకొండవ అధికారిక లేఖలో డిమాండ్ చేసింది.
బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ జరిపిన చట్టవిరుద్ధమైన దాడుల గురించి మండలి సభ్యులకు తెలియజేయడానికి ఉద్దేశించిన అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల పరంపరను కొనసాగించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితిలో బహ్రెయిన్ శాశ్వత మిషన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ-జనరల్ ఈమేరకు భద్రతా మండలి అధ్యక్షుడికి లెటర్ ను సమర్పించారు.
బహ్రెయిన్, గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలు మరియు జోర్డాన్పై ఇరాన్ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలని నిర్ధారించి, వాటిని తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817ను ఇరాన్ పట్టించుకోవడం లేదని తెలిపారు.
ఫిబ్రవరి 28 నుండి బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థలు తమ రాజ్యం గగనతలం, ప్రాదేశిక జలాలు మరియు భూభాగాన్ని లక్ష్యంగా చేసుకున్న 194 బాలిస్టిక్ క్షిపణులను, 523 శత్రు డ్రోన్లను అడ్డుకున్నాయని ఆ ప్రకటనలో వెల్లడించింది. దాడులకు ఇరాన్ పూర్తి బాధ్యత వహించాలని బహ్రెయిన్ డిమాండ్ చేసింది. అలాగే, అంతర్జాతీయ చట్టాలను అమలు చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









