దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- April 19, 2026
మస్కట్: ఇరాన్ యుద్ధ ప్రభావంతో తాత్కాలికంగా నిలిపివేయబడిన విమాన సర్వీసులను ఒమాన్ ఎయిర్వేస్ తిరిగి ప్రారంభిస్తోంది. గల్ఫ్ సహకార మండలి (GCC) ప్రాంతంలో ప్రయాణ అనుసంధానాలను పునరుద్ధరించే భాగంగా, మస్కట్ నుండి యూఏఈలోని దుబాయ్, బహ్రెయిన్లోని మనామా మరియు ఒమన్లోని ఖసాబ్ నగరాలకు విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం ఈ మార్గాల కోసం బుకింగ్లు కూడా ప్రారంభమైనట్లు విమానయాన సంస్థ వెల్లడించింది. ప్రాంతీయ నెట్వర్క్ను దశలవారీగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే, మస్కట్ నుండి ఖతార్లోని దోహా, కువైట్లోని కువైట్ సిటీ, అలాగే ఇరాక్లోని బాగ్దాద్ నగరాలకు విమాన సర్వీసులు ఏప్రిల్ 30, 2026 వరకు నిలిపివేయబడినట్లుగా ఒమాన్ ఎయిర్వేస్ స్పష్టం చేసింది.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పరిస్థితులను సమీక్షిస్తూ, అవసరమైన మార్పులు చేస్తామని సంస్థ పేర్కొంది. GCC ప్రాంతంలో సాధారణ విమాన రాకపోకలు పునరుద్ధరించేందుకు ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







