ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!

- April 20, 2026 , by Maagulf
ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!

రియాద్: :  సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ తో  రియాద్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఇంధన రంగంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపై వారు దృష్టి సారించారు. ఇంధన భద్రతకు మరియు ఇంధన సరఫరాల స్థిరత్వానికి మద్దతు ఇచ్చే ప్రయత్నాలకు వారి చర్చల్లో అత్యంత ప్రాధాన్యత అంశంగా నిలిచిందన్నారు అధికారులు.  

అదే విధంగా, రియాద్‌లోని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో అజిత్ దోవల్‌తో విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ చర్చలు జరిపారు. ఉమ్మడి సహకారానికి సంబంధించిన అంశాలపై వారు సమీక్షించారు. మిడిలీస్టులోని తాజా పరిణామాలపై కూడా వారు చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com