ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- April 22, 2026
యూఏఈః ఫ్లైయింగ్ టైగర్ (Flying Tiger) సంస్థకు చెందిన ఒక గ్లాస్ ఉత్పత్తిలో సీసం (lead) స్థాయిలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించడంతో ఆ ఉత్పత్తిని వాడొద్దని యూఏఈ ఆర్థిక వ్యవహారాల విభాగం హెచ్చరిక జారీ చేసింది. 2024-2025 కాలంలో విక్రయించబడిన, ఈ బ్రాండ్కు చెందిన 220 ml గాజు గ్లాసులను వినియోగదారులు వెంటనే వాడటం ఆపివేయాలని ఆర్థిక మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఆ ఉత్పత్తుల నంబర్లు 3057450, 3060031, 3052986, 3062993, 3055350, 3053912 అని తెలిపింది.
ఈ ఉత్పత్తిపై బయటి వైపు ఉన్న ముద్రణలో (print) సీసం మరియు కాడ్మియం స్థాయిలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. ఇవి వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు కలిగించే అవకాశం ఉందని హెచ్చరించింది. వినియోగదారులు ఆ ఉత్పత్తిని వెంటనే పారవేసి, సురక్షితంగా నిర్మూలించాలని అధికారులు సూచించారు.
ఇంతకుముందు, 'Flying Tiger Copenhagen' బ్రాండ్కు చెందిన 220 ml సామర్థ్యం గల 6,341 గాజు గ్లాసులను వెనక్కి తీసుకోవాలని (recall) సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వినియోగ సమయంలో ఆరోగ్యానికి ముప్పు కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
'Flying Tiger Copenhagen' సంస్థ గల్ఫ్ ప్రాంతంలో బలమైన మార్కెట్ ను కలిగి ఉంది. సరసమైన ధరలలో లభించే, విలక్షణమైన స్కాండినేవియన్ డిజైన్లకు ఈ సంస్థ ప్రసిద్ధి చెందింది.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









