ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- April 22, 2026
యూఏఈః ఫ్లైయింగ్ టైగర్ (Flying Tiger) సంస్థకు చెందిన ఒక గ్లాస్ ఉత్పత్తిలో సీసం (lead) స్థాయిలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించడంతో ఆ ఉత్పత్తిని వాడొద్దని యూఏఈ ఆర్థిక వ్యవహారాల విభాగం హెచ్చరిక జారీ చేసింది. 2024-2025 కాలంలో విక్రయించబడిన, ఈ బ్రాండ్కు చెందిన 220 ml గాజు గ్లాసులను వినియోగదారులు వెంటనే వాడటం ఆపివేయాలని ఆర్థిక మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఆ ఉత్పత్తుల నంబర్లు 3057450, 3060031, 3052986, 3062993, 3055350, 3053912 అని తెలిపింది.
ఈ ఉత్పత్తిపై బయటి వైపు ఉన్న ముద్రణలో (print) సీసం మరియు కాడ్మియం స్థాయిలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. ఇవి వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు కలిగించే అవకాశం ఉందని హెచ్చరించింది. వినియోగదారులు ఆ ఉత్పత్తిని వెంటనే పారవేసి, సురక్షితంగా నిర్మూలించాలని అధికారులు సూచించారు.
ఇంతకుముందు, 'Flying Tiger Copenhagen' బ్రాండ్కు చెందిన 220 ml సామర్థ్యం గల 6,341 గాజు గ్లాసులను వెనక్కి తీసుకోవాలని (recall) సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వినియోగ సమయంలో ఆరోగ్యానికి ముప్పు కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
'Flying Tiger Copenhagen' సంస్థ గల్ఫ్ ప్రాంతంలో బలమైన మార్కెట్ ను కలిగి ఉంది. సరసమైన ధరలలో లభించే, విలక్షణమైన స్కాండినేవియన్ డిజైన్లకు ఈ సంస్థ ప్రసిద్ధి చెందింది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









