ఇస్రోతో తెలంగాణా రాష్ట్రం ఉప్పందం

- August 05, 2016 , by Maagulf
ఇస్రోతో తెలంగాణా రాష్ట్రం ఉప్పందం

తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం జల వనరుల సమాచార వ్యవస్థ ఏర్పాటుపై ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు జరిగిందే నీళ్ల కోసం అని వివరించారు. డ్రోన్‌ పరిజ్ఞానంతో ప్రాజెక్టులు, కాల్వల పూర్తి సమాచారం అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రతి ప్రాజెక్టు కింద ఉన్న సాగు భూమి పూర్తి వివరాలు ఈ పరిజ్ఞానంతో కచ్చితంగా తెలుస్తుందన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుందని హరీశ్‌రావు వెల్లడించారు. ఒప్పంద పత్రాలపై మంత్రి హరీశ్‌రావు, ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌ సంతకాలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com