అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- April 23, 2026
యూఏఈ: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ల విధానంపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సర్వే ఫలితాలను అబుదాబి పర్యావరణ సంస్థ (EAD) వెల్లడించింది. పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడానికి మరియు అధిక ప్లాస్టిక్ వినియోగం ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ఒక వ్యూహాత్మక చర్యగా ఈ విధానాన్ని EAD 2020లో ప్రారంభించింది.
ఈ విధానం ప్రారంభమైనప్పటి నుండి మెరుగైన ఫలితాలు సాధించారు. వాటిలో 47 కోట్లకు పైగా ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నివారించారు. ప్రధాన రిటైల్ అవుట్లెట్లలో వీటి సంఖ్యను 95 శాతం వరకు తగ్గించినట్లు ప్రకటించారు. సుమారు 2,67 కోట్ల ప్లాస్టిక్ బాటిల్స్ ను నేరుగా ఇళ్ల నుండి లేదా ఎమిరేట్ అంతటా ఉన్న 170కి పైగా స్మార్ట్ రీసైక్లింగ్ యంత్రాల ద్వారా సేకరించినట్టు పేర్కొంది.
మొత్తం యూఏఈపై సానుకూల ప్రభావాన్ని చూపేందుకు ఎమిరేట్ చేపట్టిన మార్గదర్శక కార్యక్రమాలలో ఒకటిగా ఇది నిలిచింది. ఇది సమాఖ్య స్థాయిలో ప్లాస్టిక్ ఉత్పత్తులపై జాతీయ నిషేధానికి మరియు నియంత్రణకు దోహదపడిందని తలిపారు.
ఇదంతా 7,386 టన్నుల ప్లాస్టిక్ను డంపింగ్ స్థలాలకు మళ్లించకుండా నిరోధించడానికి సహాయపడిందన్నారు. ఈ విధంగా నివారించబడిన ఉద్గారాలు, ఒక సంవత్సరానికి 1,85,000 ఇంధనంతో నడిచే వాహనాలను రోడ్ల నుండి తొలగించిన దానికి సమానమని అంచనా వేశారు. ఈ విధానాన్ని కొనసాగిస్తూ, ఈ సంవత్సరం ప్రారంభంలో అమలు చేసిన జాతీయ ప్లాస్టిక్ నిషేధానికి అనుగుణంగా మరియు ఒక్కసారి వాడి పారేసే ఉత్పత్తుల వ్యాపారాన్ని నియంత్రించడానికి EAD పనిని అభివృద్ధి చేసే సన్నాహంలో భాగంగా, ఈ ఏజెన్సీ ఒక సర్వేను నిర్వహించింది.
ప్లాస్టిక్ల వల్ల పర్యావరణంపై కలిగే ప్రతికూల ప్రభావం గురించి ప్రజలలో అవగాహన గణనీయంగా పెరిగిందని ఫలితాలు తెలిపారు. ఈ సర్వేలో 126 దేశాలకు చెందిన 5,000 మందికి పైగా పాల్గొన్నారు. వీరిలో 96 శాతం మంది, ప్లాస్టిక్ పర్యావరణానికి కలిగించే ప్రమాదాల గురించి తమకు అవగాహన ఉందని చెప్పారు. 96 శాతం మంది రోజువారిగా ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించినట్లు తెలిపారు.
EAD సెక్రటరీ జనరల్ డాక్టర్ షేఖా సలేం అల్ ధహేరి మాట్లాడుతూ.. ఈ సర్వే ఫలితాలు, సమాజ సభ్యులలో పర్యావరణ అవగాహనను పెంచడానికి ఏజెన్సీ చేసిన ప్రయత్నాల విజయాన్ని ప్రతిబింబిస్తాయన్నారు.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









