ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- April 23, 2026
దోహా: ఖతార్ ఎయిర్వేస్ మధ్యప్రాచ్యంలోని కీలక గమ్యస్థానాలకు తమ విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు సిరియాకు రోజువారీ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించనుంది.
ఏప్రిల్ 23, 2026 నుంచి దుబాయ్ (DXB), షార్జా (SHJ)లకు రోజువారీ విమానాలు పునఃప్రారంభం కానుండగా, మే 1, 2026 నుంచి డమాస్కస్ (DAM)కు రోజువారీ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా తన నెట్వర్క్ను దశలవారీగా పునరుద్ధరించే భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. జూన్ 16, 2026 నాటికి ఆరు ఖండాల్లో 150కు పైగా గమ్యస్థానాలకు సేవలను విస్తరించనున్నట్లు ఖతార్ ఎయిర్వేస్ వెల్లడించింది.
ప్రయాణికులు తమ ప్రయాణానికి సంబంధించిన తాజా సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ను తరచుగా పరిశీలించాలని, తమ సంప్రదింపు వివరాలను సరిగా నవీకరించుకోవాలని సంస్థ సూచించింది.
ఫిబ్రవరి 28 నుంచి సెప్టెంబర్ 15, 2026 మధ్య ప్రయాణానికి బుకింగ్ చేసిన ప్రయాణికులకు కొన్ని సడలింపులు అందుబాటులో ఉంచింది. అందులో భాగంగా అక్టోబర్ 31, 2026 వరకు కొత్త తేదీకి ఉచితంగా మార్పులు చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే ప్రభావితమైన విమానాల కోసం అదనపు ఫీజులు లేకుండా మార్పులు చేసుకునే సౌకర్యం కూడా ఉంది.
విమాన ప్రయాణం రద్దు అయిన పక్షంలో వినియోగించని టికెట్ మొత్తాన్ని రీఫండ్గా పొందవచ్చని, అయితే రీఫండ్ ప్రక్రియకు 28 పని దినాలు పట్టవచ్చని తెలిపింది.
ఆపరేషనల్, నియంత్రణ, భద్రతా లేదా ఇతర అనివార్య కారణాల వల్ల విమాన షెడ్యూల్ మార్పులు లేదా రద్దులు జరిగే అవకాశం ఉందని ఖతార్ ఎయిర్వేస్ స్పష్టం చేసింది.
మరిన్ని వివరాల కోసం ప్రయాణికులు ఖతార్ ఎయిర్వేస్ అధికారిక వెబ్సైట్ను https://www.qatarairways.com/en-ae/rebooking-options.html సందర్శించాలని సూచించింది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









