కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!

- April 25, 2026 , by Maagulf
కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!

కువైట్: కువైట్ ఉత్తర భూ సరిహద్దు వెంబడి ఉన్న రెండు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని, పేలుడు పదార్థాలు అమర్చిన రెండు డ్రోన్‌లతో దాడి జరిగిందని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఫైబర్ ఆప్టిక్ వైర్ల ద్వారా నియంత్రించబడిన ఈ డ్రోన్‌లు ఇరాక్ నుండి బయలుదేరి సరిహద్దు పోస్టులను ఢీకొట్టాయని, దీనివల్ల ఆస్తి నష్టం సంభవించిందని అధికార ప్రతినిధి కల్నల్ సౌద్ అబ్దుల్ అజీజ్ అల్-అత్వన్ తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని ఆయన ధృవీకరించారు. దాడి ఘటనపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కాగా, కువైట్ పై డ్రోన్ దాడిని గల్ఫ్ దేశాలు ఖండించాయి. ఇలాంటి దాడులు ప్రాంతీయ భద్రతకు విఘాతం కలిగిస్తాయని హెచ్చరించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com