కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- April 25, 2026
కువైట్: కువైట్ ఉత్తర భూ సరిహద్దు వెంబడి ఉన్న రెండు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని, పేలుడు పదార్థాలు అమర్చిన రెండు డ్రోన్లతో దాడి జరిగిందని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఫైబర్ ఆప్టిక్ వైర్ల ద్వారా నియంత్రించబడిన ఈ డ్రోన్లు ఇరాక్ నుండి బయలుదేరి సరిహద్దు పోస్టులను ఢీకొట్టాయని, దీనివల్ల ఆస్తి నష్టం సంభవించిందని అధికార ప్రతినిధి కల్నల్ సౌద్ అబ్దుల్ అజీజ్ అల్-అత్వన్ తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని ఆయన ధృవీకరించారు. దాడి ఘటనపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కాగా, కువైట్ పై డ్రోన్ దాడిని గల్ఫ్ దేశాలు ఖండించాయి. ఇలాంటి దాడులు ప్రాంతీయ భద్రతకు విఘాతం కలిగిస్తాయని హెచ్చరించాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్







