కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- April 25, 2026
కువైట్ సిటీ: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ T4 నుండి వచ్చే వారం 13 గమ్యస్థానాలకు 35 వాణిజ్య విమాన సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ యాక్టింగ్ సీఈఓ అబ్దుల్వహాబ్ అల్-షట్టి శనివారం వెల్లడించారు.
ప్రారంభ దశలో బీరుట్, రియాద్, లండన్, ఇస్తాంబుల్, ఢాకా, ముంబై, కొచ్చి, కొలంబో, ఢిల్లీ, మనీలా, కైరో, జెడ్డా, త్రివేండ్రం వంటి నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభమవనున్నాయి.
విమాన షెడ్యూల్ ప్రకారం, కైరోకు రోజువారీ విమానాలు నడవగా, ఏప్రిల్ 27 నుంచి బీరుట్కు సోమ, బుధవారాల్లో వారానికి రెండు సర్వీసులు ఉంటాయి. ఏప్రిల్ 28 నుంచి రియాద్కు మంగళ, శుక్రవారాల్లో విమానాలు నడుస్తాయి.
అదేవిధంగా, జెడ్డాకు ఏప్రిల్ 28 నుంచి వారానికి నాలుగు సర్వీసులు, లండన్కు వారానికి మూడు సర్వీసులు ప్రారంభమవుతాయి. కొలంబోకు ఏప్రిల్ 27 నుంచి వారానికి ఒక సర్వీస్, ఇస్తాంబుల్కు ఏప్రిల్ 29 నుంచి వారానికి ఒక సర్వీస్ అందుబాటులోకి రానున్నాయి.
భారతదేశ నగరాలైన ఢిల్లీ, ముంబై, కొచ్చి, త్రివేండ్రానికి కూడా వివిధ రోజుల్లో సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఢాకాకు వారానికి నాలుగు సర్వీసులు, మనీలాకు వారానికి మూడు సర్వీసులు నడపనున్నట్లు సంస్థ తెలిపింది.
అధికారిక అనుమతులు లభించిన వెంటనే మరిన్ని గమ్యస్థానాలకు సేవలను విస్తరించనున్నట్లు అల్-షట్టి పేర్కొన్నారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో నిరంతరాయ సేవలు అందించేందుకు కువైట్ ఎయిర్వేస్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







