ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదాపై త్వరలోనే స్పష్టత ..
- August 06, 2016
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదాపై త్వరలోనే స్పష్టత వస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. శనివారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే, భాజపాపై మాట్లాడే అర్హత కాంగ్రెస్కు లేదన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు. లోక్సభ సాక్షిగా వీరప్పమొయిలీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని కోరారు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే పొరుగు రాష్ట్రాల నుంచి పెట్టుబడులు తరలిపోతాయని హెచ్చరించారని చెప్పారు. సభలో నిన్న మాట్లాడిన కాంగ్రెస్ సభ్యులు చట్టంలో.. హామీలను ఎందుకు పొందపరచలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఆర్థికమంత్రి, నీతి ఆయోగ్ ఛైర్మన్ కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







