బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- April 26, 2026
మనామా: బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం ప్రారంభమైంది. దీనిని రషీద్ ఈక్వెస్ట్రియన్ అండ్ హార్స్ రేసింగ్ క్లబ్.. బహ్రెయిన్ ముమ్తాలకత్ హోల్డింగ్ కంపెనీ ఆధ్వర్యంలోని “మజాద్” సహకారంతో నిర్వహిస్తోంది. ఏప్రిల్ 28 వరకు జరిగే ఈ వేలం పాట బహ్రెయిన్లో మొదటిసారిగా వర్చువల్గా నిర్వహిస్తున్నారు.
వరుసగా నాలుగోసారి జరుగుతున్న ఈ వార్షిక గుర్రాల వేలం.. ప్రధానమంత్రి దర్బారు మంత్రి అయిన షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అధ్యక్షతన జరుగుతోంది. ఈ రంగంలో మార్కెటింగ్ను బలోపేతం చేసే లక్ష్యంతో రషీద్ ఈక్వెస్ట్రియన్ అండ్ హార్స్ రేసింగ్ క్లబ్ మరియు మజాద్ మధ్య కుదిరిన ఒప్పందం కింద కూడా ఈ వేలం జరుగుతుంది.
"మజాద్" మొబైల్ అప్లికేషన్ ద్వారా గుర్రాల యజమానులు, ఔత్సాహికులు మరియు ప్రజలు ఈ వేలంలో పాల్గొనవచ్చు. వేలం కోసం అందుబాటులో ఉన్న గుర్రాల తుది జాబితాను కంపెనీ అధికారిక వెబ్సైట్లో ప్రచురించినట్లు నిర్వాహకులు తెలియజేశారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







