చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- April 26, 2026
చెన్నై: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్కు షాక్ ఇచ్చింది. సాయి సుదర్శన్ తన అద్భుత బ్యాటింగ్తో చెన్నై కోటలో గుజరాత్ జెండా పాతాడు.37వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెలరేగిపోయింది. చెన్నైతో జరిగిన పోరులో అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన గుజరాత్.. 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 74 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబడా(3/25)మూడు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్(2/43) రెండు వికెట్లు పడగొట్టాడు. మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్కు చెరో వికెట్ దక్కింది.
అనంతరం గుజరాత్ టైటాన్స్ ఓవర్లలో 159 పరుగులు చేసి గెలుపొందింది. సాయి సుదర్శన్(46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్లతో 87) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శుభ్మన్ గిల్(23 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 33), జోస్ బట్లర్(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 39 నాటౌట్)రాణించారు. నూర్ అహ్మద్, అకీల్ హుసేన్ చెరో వికెట్ తీసారు. గుజరాత్ టైటాన్స్కు ఇది నాలుగో విజయం కాగా.. చెన్నై సూపర్ కింగ్స్కు ఐదో పరాజయం.
తాజా వార్తలు
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!









