సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- April 27, 2026
రియాద్ః సౌదీ అరేబియాలోని వారసత్వ పట్టణాలను పునరుజ్జీవింపజేయడానికి త్వరలో ఒక జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభం కానుంది. గ్రామాలు మరియు చారిత్రక ప్రదేశాలకు కొత్త జీవం పోసి, వాటిని సాంస్కృతిక, పర్యాటక మరియు ఆర్థిక గమ్యస్థానాలుగా మార్చడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని హెరిటేజ్ కమిషన్ ప్రకటించింది. సౌదీ అరేబియా వ్యాప్తంగా సుమారు 562 ప్రైవేట్ యాజమాన్యంలోని వారసత్వ పట్టణాలు మరియు గ్రామాలు ఉన్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి.
160కి పైగా వారసత్వ ప్రదేశాలలో పునరుద్ధరణ కార్యక్రమాలను అమలు చేసినట్లు హెరిటేజ్ కమిషన్ వెల్లడించింది. ఆయా భవనాలు మరియు కళాఖండాలకు భంగం కలగకుండా, వాటి జీవితకాలాన్ని పొడిగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. గతంలో వారసత్వ ప్రదేశాలను పునరుద్ధరించడానికి 37 సమీకృత ప్రాజెక్టులను పూర్తి చేసినట్ల పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులలో ఖుబా కోట, అల్-ఉయున్ కోట, ఉర్వా ప్యాలెస్ వంటి చారిత్రక ప్రదేశాలతో పాటు ఖిష్లా ప్యాలెస్, అల్-బహా ప్రాంతంలోని అల్-అతవ్లా ప్రదేశాలు, షక్రా, అల్-షిక్రా పట్టణాల వంటి అనేక ప్రముఖ చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయన్నారు. 100కు పైగా వారసత్వ పట్టణాలు కేటగిరీ Aగా వర్గీకరించబడ్డాయని, ఇది వాటి చారిత్రక మరియు నిర్మాణ ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!
- ఇబ్రా, అల్ ముధైబి ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో వైద్యసేవలు..!!
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం









