ఒమన్ తో ఇండస్ట్రియల్ సహకారంపై చర్చించిన అల్ఖోరాయెఫ్..!!
- April 28, 2026
రియాద్: సౌదీ అరేబియా పరిశ్రమలు మరియు ఖనిజ వనరుల శాఖ మంత్రి బందర్ అల్ఖోరాయెఫ్.. ఒమన్ పబ్లిక్ అథారిటీ అధ్యక్షుడు ఖైస్ అల్-యూసెఫ్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల మధ్య పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం, ఉమ్మడి పెట్టుబడులను అభివృద్ధి చేయడంపై వారు చర్చించారు.
సౌదీ మరియు ఒమన్ ఆర్థిక వ్యవస్థల పోటీతత్వాన్ని పెంచే విధంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలను అభివృద్ధి చేసే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. పారిశ్రామిక మరియు పెట్టుబడి భాగస్వామ్యాలను విస్తరించడం, పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నైపుణ్యం, ప్రాధాన్యత కలిగిన పారిశ్రామిక రంగాలలో నాణ్యమైన పెట్టుబడులను ప్రోత్సహించడం ప్రాముఖ్యతను ఇరుపక్షాలు తెలియజేశాయి. ఇది రెండు దేశాల జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటూ ఉమ్మడి ప్రయోజనాల సాధనకు దోహదపడుతుందన్నారు.
సౌదీ అరేబియా మరియు ఒమన్ మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, అలాగే రెండు దేశాల మధ్య ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక ఏకీకరణ లక్ష్యాలను సాధించడానికి పారిశ్రామిక రంగంలో సహకారాన్ని పెంపొందించడంపై ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!
- నాలుగు రెట్లు పెరిగిన ఒమన్-రష్యా వాణిజ్యం..!!
- ఒమన్ తో ఇండస్ట్రియల్ సహకారంపై చర్చించిన అల్ఖోరాయెఫ్..!!
- క్రెడిట్ కార్డు నిబంధనలను కఠినతరం చేయాలని ఎంపీల ఒత్తిడి..!!
- ఖతార్లో మెరైన్ వార్నింగ్ జారీ..!!
- ఇరాక్ కొత్త ప్రధానిగా అలీ అల్-జైదీ
- శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ









