ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- May 01, 2026
పారిస్: రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (RSF) విడుదల చేసిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో ఒమన్ సుల్తానేట్ ప్రపంచవ్యాప్తంగా ఏడు స్థానాలు మెరుగుపడింది. 2025లో 134వ స్థానంలో ఉన్న ఒమన్, 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా 127వ స్థానానికి చేరుకుంది.
ఒమన్ సుల్తానేట్లో మీడియా వాతావరణాన్ని మెరుగుపరచడానికి మరియు పాత్రికేయ వృత్తిని నియంత్రించడానికి మెరుగైన ప్రయత్నాలు జరిగాయని నివేదిక కొనియాడింది. మీడియా రంగంలో వేగంగా జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా శాసనపరమైన చట్టాలను అప్డేట్ చేయడంతోపాటు అభిప్రాయ మరియు భావప్రకటనా స్వేచ్ఛకు మద్దతు ఇస్తున్నారని నివేదిక పేర్కొన్నది.
పత్రికా స్వేచ్ఛ సూచిక అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో మీడియా స్వేచ్ఛ స్థాయిని కొలిచే ప్రధాన అంతర్జాతీయ సూచికలలో ఒకటి. ఇది మీడియా స్వాతంత్ర్యం, చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ మరియు పాత్రికేయుల భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అదే సమయంలో మీడియా స్వేచ్ఛను ప్రభావితం చేసే ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులతో పాటు భద్రత, రాజకీయ సందర్భం మరియు చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ వంటి ప్రమాణాల ఆధారంగా 180 దేశాకు ర్యాంకులను కేటాయిస్తుంది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







