కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- May 01, 2026
కువైట్: కువైట్లోని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ కొన్ని నియంత్రిత రంగాలలో నియమించబడిన కార్మికులను ఇతర రంగాలకు బదిలీ చేయడానికి అనుమతించనున్నారు. ఇది నేటి నుండి అమల్లోకి వచ్చిందని జూన్ 30 వరకు బదిలీలకు అనుమతి ఉంటుందని ప్రకటించారు.
ఈ ఉత్తర్వుల నుండి ప్రయోజనం పొందడానికి దరఖాస్తులను కంపెనీల కోసం కేటాయించిన “అస్ హాల్” సర్వీస్ ద్వారా సమర్పించాలని అధికార సంస్థ తెలిపింది. బదిలీ అభ్యర్థనలను అంగీకరించడానికి మరియు అవసరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి అసలు యజమాని నుండి ఆమోదం పొందడం తప్పనిసరి అని తెలిపింది.
ఈ ఉత్తర్వుల పరిధిలోకి వచ్చే రంగాలలో చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు, పరిశ్రమ, వ్యవసాయం, పశుపోషణ మరియు మత్స్య పరిశ్రమ ఉన్నాయని ప్రకటించారు. మారుతున్న కార్మిక మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా యజమానులు మరియు కార్మికుల మధ్య సంబంధాన్ని నిర్ధారించడం లక్ష్యంగా తీసుకున్న ఒక నియంత్రణ చర్యగా ఈ ఉత్తర్వులను భావిస్తున్నారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







