కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- May 01, 2026
మనామా: కార్పొరేట్ ఆదాయపు పన్నును ప్రవేశపెట్టే ముసాయిదా చట్టంపై రాజ్యాంగపరమైన ఆందోళనలను పార్లమెంట్ శాసన మరియు న్యాయ వ్యవహారాల కమిటీ లేవనెత్తింది. అదే సమయంలో అనేక ఇతర శాసన ప్రతిపాదనల చట్టబద్ధతను ఆమోదించింది. మహమూద్ మీర్జా ఫర్దాన్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ.. అనేక ముసాయిదా చట్టాలు మరియు ప్రతిపాదనలను సమీక్షించింది.
ముఖ్యంగా కార్పొరేట్ ఆదాయపు పన్ను చట్టం మరియు వ్యాపార కార్యకలాపాల ఫ్రేమ్ వర్క్ లోని ముసాయిదాలో రాజ్యాంగపరమైన సమస్యను గుర్తించినట్లు తెలిపారు. దానిని మరింత పరిశీలన చేయాలని రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ప్రైవేట్ రంగ కార్మిక చట్టంలోని ఆర్టికల్ 104(బి)ని సవరించాలనే ప్రతిపాదన రాజ్యాంగబద్ధతను కమిటీ ఆమోదించింది.
అలాగే, న్యాయాధికార చట్టానికి కొత్త ఆర్టికల్ 7 బిస్ను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను కూడా కమిటీ ఆమోదించింది. దీనిని ప్రతినిధుల మండలి బ్యూరోకు సమర్పించే ముందు తదుపరి సమీక్ష కోసం ఆర్థిక మరియు వాణిజ్య వ్యవహారాల కమిటీకి రిఫర్ చేశారు. వీటితోపాటు పారిశ్రామిక ప్రాంతాలను నియంత్రించే చట్టానికి సవరణలను మరియు GCC ఏకీకృత ఎక్సైజ్ ట్యాక్స్ ఒప్పందానికి మార్పులను ధృవీకరించే ముసాయిదా చట్టాన్ని కమిటీ ఆమోదించినట్ల ఒక ప్రకటలో వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







