EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- May 01, 2026
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర ఎన్నికల సంఘం (EC) తీసుకున్న తాజా నిర్ణయంపై ధర్మపోరాటానికి దిగారు. కౌంటింగ్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ అధికారుల జోక్యంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓట్ల లెక్కింపు సమయం దగ్గరపడుతున్న వేళ, కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేంద్ర ప్రభుత్వ అధికారులు లేదా ప్రభుత్వ రంగ సంస్థల (PSU) ఉద్యోగులను నియమించాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై టీఎంసీ (TMC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిబంధనను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల ఫలితాల పారదర్శకతను దెబ్బతీసేలా ఈ నిర్ణయం ఉందని, దీనిపై అత్యవసర విచారణ జరపాలని మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.
కౌంటింగ్ కేంద్రాల్లో ప్రతి టేబుల్ వద్ద ఉండే సూపర్వైజర్ లేదా అసిస్టెంట్లలో కచ్చితంగా ఒకరు కేంద్ర ప్రభుత్వ అధికారి ఉండాలని పశ్చిమ బెంగాల్ అదనపు సీఈఓ (CEO) ప్రకటించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీ నియంత్రణలో ఉంటుందని, అటువంటప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కౌంటింగ్ ప్రక్రియలో ఉంటే వారు అధికార పార్టీ ఒత్తిడికి లోనయ్యే లేదా ప్రభావితమయ్యే అవకాశం ఉందని టీఎంసీ వాదిస్తోంది. ఇది నిష్పాక్షికంగా జరగాల్సిన లెక్కింపు ప్రక్రియను తప్పుదోవ పట్టించడమేనని ఆ పార్టీ ఆరోపిస్తోంది.
బెంగాల్ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న తరుణంలో, కౌంటింగ్ ప్రక్రియపై చోటుచేసుకున్న ఈ న్యాయపోరాటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల సంఘం తన పరిధిని దాటి వ్యవహరిస్తోందని అధికార పార్టీ విమర్శిస్తుండగా, పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈసీ స్పష్టం చేస్తోంది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తుందా? ఒకవేళ విచారణ జరిగితే కౌంటింగ్ నిబంధనల్లో మార్పులు వస్తాయా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







