ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- May 03, 2026
అమెరికా: గత కొంతకాలంగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు ఇరాన్ ప్రభుత్వం చొరవ చూపింది. ఈ మేరకు 14 కీలక అంశాలతో కూడిన ఒక ప్రతిపాదనను అమెరికాకు పంపింది.రాబోయే 30 రోజుల్లోగా సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని, భవిష్యత్తులో తమ దేశం పై ఎటువంటి సైనిక దాడులు జరగవని అమెరికా లిఖితపూర్వక హామీ ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. వీటితో పాటు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న కఠినమైన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో మరింత నష్టపోకుండా ఉండేందుకే ఇరాన్ ఈ శాంతి మంత్రాన్ని జపిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరాన్ పంపిన ఈ ప్రతిపాదనలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇరాన్ పంపిన 14 అంశాల ప్రతిపాదన నా వద్దకు చేరింది, దానిని మేము పరిశీలిస్తున్నాం” అని చెబుతూనే, ఆ దేశంపై తనకున్న అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇరాన్ గతంలో చేసిన తప్పులకు, అంతర్జాతీయంగా సృష్టించిన అశాంతికి ఇంకా తగిన మూల్యం చెల్లించుకోలేదని తాను భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. శాంతి చర్చలకు సిద్ధమే అని సంకేతాలిస్తూనే, ఇరాన్ వైఖరిపై తమకున్న పాత పగ ఇంకా చల్లారలేదని ట్రంప్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలతో అగ్రరాజ్యం ఇరాన్ ప్రతిపాదనలను అంగీకరిస్తుందా లేదా అనే సందిగ్ధం నెలకొంది. ఇరాన్ ఆంక్షల ఎత్తివేతను ప్రధానంగా కోరుతుండగా, అమెరికా మాత్రం ఆ దేశాన్ని మరింత లొంగదీసుకోవాలని చూస్తోంది. ఒకవేళ అమెరికా ఈ 14 అంశాల ఒప్పందానికి ఒప్పుకోకపోతే, మధ్య ప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకునే ప్రమాదం ఉంది. 30 రోజుల గడువులోగా ఏదైనా సానుకూల నిర్ణయం వెలువడుతుందా లేక ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్ మరిన్ని కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందా అనేది ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో ఉత్కంఠ రేపుతోంది.
తాజా వార్తలు
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం







